తనతండ్రిని పాపిన ప్రశాంత్ రెడ్డిని జీవితంలో క్షమించను.. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత
నిజామాబాద్ : తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సాధించుకుంటే జీవితాలు మారిపోతాయని భావించి ప్రజలకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందని ఆమె అన్నారు. సోమవారం నిజామామాబాద్ లో ఏర్పాటు చేసిన పాంచజన్య సంకల్ప సభలో కవిత ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగిండ్లు మాత్రమే బంగారు మాయమయ్యాయని అన్నారు. సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు బాగుపడాల్సిన అవసరముందని అందుకోసం సామాజిక న్యాయ తెలంగాణ అవసరమని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం 20 ఏళ్లు కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్ నుంచి నిర్దాక్షణ్యంగా వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పదవుల కోసం పార్టీ పెట్టలేదని తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోసం పంతం పట్టి పార్టీ పెట్టానని అన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన 4 నెలల తర్వాత సొంతూరు నిజామాబాద్ కు రావటం సంతోషంగా ఉందని కవిత అన్నారు. గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీ ఏ విధంగా ఆశీర్వాదం ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఆశీర్వాదం ఇవ్వాలని కవిత నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి ...