Posts

తెలంగాణపై విద్వేషం చరిత్రను ఏమార్చే కుట్ర

Image
తెలంగాణ ఉనికిపై TDP వ్యాఖ్యలు.. చారిత్రక ఆధారాలతో తెలంగాణ వాదుల కౌంటర్ ఎప్పటిలాగే తెలంగాణ మీద విషం చిమ్మింది తెలుగుదేశం పార్టీ.TDP ఆవిర్భావ పండుగ వేళా ఆంధ్ర రాజధాని మంగళగిరి వేదికగా తెలంగాణను అవమానిస్తూ మాట్లాడారు పొలిట్బ్యూరో సభ్యుడు నర్సింహులు. తెలంగాణ ఉనికిని ప్రశ్నిస్తు డిక్షనరిలో తెలంగాణ లేనే లేదు అని అన్నారు. ఈ మాటలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో రాకెట్ స్పీడ్ లో వైరల్ అయ్యింది.తెలంగాణ వాదులు కౌంటర్లతో విరుచుకుపడ్డారు.. చరిత్రలో తెలంగాణ ఉనికికి సంబంధించిన సమాచారం మన నిజామాబాద్ పాఠకుల కోసం... *తెల్లాపూర్ శాసనం (క్రీ.శ. 1417). తెలంగాణ అనే పదం స్పష్టంగా చెక్కబడింది! *వెలిచర్ల శాసనం (క్రీ.శ. 1510) తెలంగాణ ముఖభూమి అని ప్రస్తావన ఉంది! * తిరుమల శాసనాల్లో శ్రీకృష్ణదేవరాయలు ‘తెలంగాణ దుర్గాలు’ జయించినట్లు రాయబడింది! *అమీర్ ఖుస్రో… క్రీ.శ. 1318లోనే “తిలంగి” అనే పదంతో తెలంగాణ భాషను ప్రస్తావించాడు! *పాల్కురికి సోమనాథుడు తన రచనల్లో తెలంగాణ నేల వైభవాన్ని పలికించాడు! * విద్యానాథుడి “ప్రతాపరుద్ర యశోభూషణం”లో… త్రిలింగ దేశ గౌరవం వెలుగొందింది! * అబుల్ ఫజల్ “అయి...

నక్సల్బరీ తొలి అమరులు మహిళలే..! చరిత్రలో నిలిచిన మే 25 ఘటన

Image
నక్సల్బరీ తొలి అమరులు మహిళలే..! (వ్యాసకర్త ;S A. డేవిడ్) ........ మే 25, 1967. మధ్యాహ్నం 2 గంటలు. నక్సల్బరీ సమీపంలోని బెంగాయ్ జోట్ గ్రామం. ధనేశ్వరి దేవి నాయకత్వంలో వందలాది మంది మహిళలు గుమిగూడి ఉన్నారు. స్ధానిక భూస్వామికి వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించడానికి మహిళలంతా గుమిగూడి వున్నారక్కడ. పరిస్థితి ఉద్రిక్తంగా వుంది. ఏ క్షణంతో ఏం జరుగుతోంది తెలియని స్థితి. అంతకు రెండు రోజుల నుండి ఆ ప్రాంతంలో స్థానిక రైతు కూలీలకూ,పోలీసులకూ మధ్య చెదురుమదుర సంఘటనలు జరుగుతూనే వున్నాయి. మే 24 వ తేదీన 'బిగుల్ కిషన్' అనే గిరిజన రైతు తాను సాగు చేసుకుంటున్న భూమిపై కోర్టు తీర్పు అతనికి అనుకూలంగా వచ్చింది. బిగుల్ కిసాన్ అప్పటికే సీపిఎం పార్టీ అనుబంధ రైతు సంఘమైన ’కృషక్ సభ‘లో సభ్యుడిగా ఉండేవాడు. ఆ సంవత్సరం మార్చిలో జరిగిన ఒక సమావేశంలో కృషక్ సభ కౌలు రైతులుగా వున్న వాళ్ళు తమ భూములను స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమైన తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని దృష్టిలో వుంచుకున్న కిషన్, తనకు అనుకూలంగా ఇచ్చిన కోర్టు తీర్పును చేతబట్టుకొని మే 21న కిసాన్ తన పంటను కోయడానికి వెళ్ళాడు. ఇదే అదునుగా భావించిన భూస్వామి ట...

PCC చీఫ్ పై ' బిగ్' కుట్ర -- మహేష్ ఇమేజ్ డ్యామేజ్

Image
(జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు)✍︎ తెలంగాణ కాంగ్రెస్ లో ఎదిగి వచ్చిన బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ మీద 'బిగ్' కుట్ర జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడి నేతృత్వంలో నడుస్తున్న ఒక టీవీ చానల్ లో శుక్రవారం అన్ని బులెటిన్లలో మహేష్ గౌడ్ ను విఫల పీసీసీ చీఫ్ గా నమ్మించడానికి వార్తలను వండి వార్చారు. 20 ఏళ్లుగా ఇలాంటి కుక్డ్ బులెటిన్స్ ఏ పీసీసీ అధ్యక్షుడి మీద..ఏ ఛానల్ లోనూ ప్రసారం కాకపోవడం విశేషం. తెలంగాణ రాజకీయాల్లో బీసీ రాజ్యాధికారం కాంక్ష ఇటీవలి కాలంలో తారా స్థాయికి చేరుకుంది. సమీప భవిష్యత్తులో వచ్చే ఏ ఎన్నికల్లో అయినా బీసీ లకు రాజకీయ ప్రాధాన్యం పెంచక తప్పని సరి పరిస్థితిని అన్ని పార్టీలు ఎదుర్కోబోతున్నాయి.. ఈ నేపథ్యంలో మహేష్ గౌడ్ ను రేవంత్ కొలువులో చేర్చి..అవసరమైతే బీసీ కోటలో డిప్యూటీ సీఎం పదవిని అప్పచెబుతారని ఇటీవలి కాలంలో బలమైన ప్రచారం జరుగుతోంది. మహేష్ స్థానంలో మరో బీసీ కి పీసీసీ పగ్గాలు అప్పచెబుతారని... ఇలా బీసీ సంతుష్ట వైఖరితో తెలంగాణలో సోషల్ ఇంజనీరింగ్ చేయాలని జనపథ్ 10 వర్గాలు ఆలోచిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాల్లో వినబడుతోంది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా మహేష్ ...

64 ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసిన అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్.. 80 కిలోల కాపర్ కాయిల్స్ స్వాధీనం

Image
జిల్లాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేస్తూ, వాటిలోని రాగి (కాపర్) కాయిల్స్ ను అపహరిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్జిల్లా దొంగల మురాను రెంజల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. లక్షల విలువైన 80 కిలోల కాపర్ కాయిల్స్, దొంగతనాలకు ఉపయోగించిన 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న నలుగురు స్క్రాప్ (పాత ఇనుప సామాను) వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. గురువారం (మే 21) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రెంజల్ సట్- ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గన్నీ బ్యాగును తనిఖీ చేయగా, అందులో భారీ మొత్తంలో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ లభ్యమయ్యాయి. ప...

గల్ఫ్ కార్మికుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం.. ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR

Image
గల్ఫ్ కార్మికుల ఓట్లు తొలగిస్తే ఊరుకోం --ఉమ్మడి నిజామాబాద్ నేతలతో KTR ........ జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కును కాపాడేందుకు పార్టీ తరఫున ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. త్వరలో రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓటర్ల ఓట్ల జాబితా సవరణ కోసం ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న SIR కార్యక్రమానికి సంబంధించిన విషయంలో లక్షలాది మంది తెలంగాణ ఎన్ఆర్ఐల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నదని కేటీఆర్ అన్నారు. ఈ విషయంలో గల్ఫ్ బాట పట్టిన తెలంగాణ బిడ్డల ఓటు హక్కులు తొలగించకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘాన్ని పార్టీ తరఫున కలుస్తామని తెలిపారు. శుక్రవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జీల సమావేశంలో సీనియర్ నేతలతో కూడిన సమీక్షా సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఇప్పటికే వందలాది మంది ఎన్ఆర్ఐలు తమ స్థానిక శాసన సభ్యులకు, మాజీ శాసన సభ్యులకు ఫోన్లు చేసి ఆందోళన చెందుతున్న విషయాన్ని కేటీఆర...

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు సత్కారం.. ప్రశంసా పత్రాలు అందజేసిన జిల్లా యంత్రాంగం

Image
*సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లకు సత్కారం ............ నిజామాబాద్, మే 22 : వివిధ వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు చేరేలా సామాజిక మాధ్యమాల ద్వారా కృషి చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు బహూకరించి సత్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో శుక్రవారం జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా స్థాయి వేడుకలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ భూపతి రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, నగర మేయర్ ఉమారాణి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ తదితరుల చేతుల మీదుగా సామాజిక మాధ్యమ కార్యకర్తలకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్డు భద్రతా చర్యల గురించి విశేషంగా కృషి చేసిన దృష్ట్యా సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లను సత్కరించడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతి...

తెలంగాణ జన సమితిలో చేరిన బాస రమేష్ యాదవ్.. కోదండరాం సమక్షంలో పార్టీలోకి ఆహ్వానం

Image
తెలంగాణ జన సమితిలో బాస రమేష్ యాదవ్ ............ హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు బాస రమేష్ యాదవ్ ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాస రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, తెలంగాణ పునర్నిర్మాణం కోదండరాం గారి నాయకత్వంలోనే సాధ్యమనే నమ్మకంతో టి.జే.ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం తెలంగాణ జన సమితి ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రస్తుతం డబ్బు కేంద్రంగా సాగుతున్న రాజకీయాల మధ్య ప్రజల ఆకాంక్షలనే అజెండాగా చేసుకుని టి.జే.ఎస్ పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జన...

తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది..? ప్రజలేమనుకుంటున్నారు..?

Image
*ప్రజలేమనుకుంటున్నారు..?* ......... (కొండల్ ,సీనియర్ జర్నలిస్టు) డేంజర్ బెల్స్ తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ ఎలా ఉంది.? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న తరహాలో 2034 ఎన్నికల నాటికి ఆయన సేఫ్ గా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టే పరిస్థితి ఉన్నదా..? నాయకులు, ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలంగాణలో “లోకమంతా పచ్చగా” ఉందా..? ఇది వందిమాగధుల అభిప్రాయం కాదు. ఆస్థాన విశ్లేషకుల చిట్టా అంతకంటే కాదు. కానీ జనబాహుళ్యం ప్రతిస్పందన కూడా ఒకసారి ప్రభువులకు చేరాల్సి ఉంది. వాళ్లు భావిస్తున్నట్లు ఇప్పుడు తెలంగాణలో అధికార పార్టీకి ఆశాజనకమైన ఫలితాలు వచ్చే పరిస్థితి లేదు. పలు అంశాల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వివాదాస్పద శైలి, నిరంకుశత్వాన్ని నిర్భీతిగా నిరసించిన తెలంగాణ ఓటర్లకు నచ్చడం లేదు. తెలంగాణ అంటేనే ధిక్కారం. ప్రజల అవసరాలకు భిన్నంగా వ్యవహరించే ప్రభువులను ధిక్కరించే సంస్కృతి ఇక్కడిది. రాష్ట్రాన్ని సాధించానని అభిప్రాయంతో తనకిష్టమొచ్చిన రీతిలో పరిపాలించవచ్చని భావించిన కేసీఆర్ కు పదేళ్ల తరువాత పరాభవం తప్పలేదు. ఆయన పరాభవం తమ ప్రతిభ వల్ల అని ఎవరైనా భావిస్తే వాళ్లకు కూడా శంకరగిరి మాన్యాలు తప్పవని ...

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం.. నాలుగు కేటగిరీల ప్రతిపాదనలు

Image
నాలుగు కెటగిరీల్లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు.. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ లో ఆదివారం జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు ఫ్రొ,, కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు.. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం నుండి అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు.. అమరవీరుల జ్యోతి కింద ఉన్న ఆఫీస్ లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసేలా కమిటీ లో నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర ప్రతిపాదనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ,1969 ఉద్యమకారులు , ఉద్యోగ సంఘాలు, కళాకారుల జెఎసి, సబ్బండ వర్గాల జెఏసీ , కుల సంఘాల ,న్యాయవాదులు జేఏసీ,వివిధ జిల్లాలో ఏర్పడిన ఉద్యమ సంఘాలు వారి నుండి ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యమకారుల కమిటీ జిల్లా పర్యటనలు చేసి విసృతంగా ప్రజల అభిప...