Posts

ఆటో కార్మికుల సమస్యలపై గణేష్ బిగాల భారీ ర్యాలీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Image
ప్రజా వంచన పాలనఇది -బిగాల గణేష్ ఆగ్రహం నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన, నెరవేర్చని హామీలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో గణేష్ బిగాల ఆదివారం భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ఆటో కార్మికులతో కలిసి ఈ నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన పూర్తిగా కుప్పకూలిందని, ప్రజా సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నిర్ణయాల వల్ల ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిని, వారి పొట్ట కొట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఆదాయం లేక నిత్యం తిండికి కూడా ఇబ్బందులు పడుతూ, పలువురు ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో సోదరులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, నగరంలో పారిశుధ్య లో...

22A భూముల జాబితాతో ప్రజలు ఇబ్బందుల్లో.. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై గణేష్ బిగాల విమర్శలు

Image
. "నిషేధిత" కుట్రతో భూములను మింగాలని స్కెచ్ కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల నయవంచన పాలనలో జరిగిన మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు నిర్వహించిన నిరసన కార్యక్రమం గణేష్ బిగాల నిర్వహించారు. 22A నిషేధిత జాబితాతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు - రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు, భూములకు రక్షణ లేకుండా పోయిందని గణేష్ బిగాల మండిపడ్డారు. - ముఖ్యంగా 22A నిషేధిత జాబితాలో ప్రైవేట్ భూములు చేరడం వల్ల రైతులు, భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. - 22A జాబితాలో భూములు చేరడంతో వాటిని అమ్ముకోవడం, కొనుగోలు చేయడం, బ్యాంకుల్లో తాకట్టు పెట్టడం వంటి లావాదేవీలు నిలిచిపోతున్నాయని తెలిపారు. - 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు వంటి రక్షించాల్సిన భూములను నిషేధిత జాబితాలో ఉంచే ఉద్దేశం ఉందని, అయితే ప్రైవేట్ వ్యక్తుల...

తనతండ్రిని పాపిన ప్రశాంత్ రెడ్డిని జీవితంలో క్షమించను.. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

Image
నిజామాబాద్ : తెలంగాణకు ఇప్పుడు కావాల్సింది బంగారు తెలంగాణ కాదు బహుజన తెలంగాణ అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ సాధించుకుంటే జీవితాలు మారిపోతాయని భావించి ప్రజలకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు రావాల్సిన అవసరముందని ఆమె అన్నారు. సోమవారం నిజామామాబాద్ లో ఏర్పాటు చేసిన పాంచజన్య సంకల్ప సభలో కవిత ప్రసంగించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగిండ్లు మాత్రమే బంగారు మాయమయ్యాయని అన్నారు. సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలు బాగుపడాల్సిన అవసరముందని అందుకోసం సామాజిక న్యాయ తెలంగాణ అవసరమని చెప్పారు. తెలంగాణ ప్రజల కోసం 20 ఏళ్లు కష్టపడి పనిచేస్తే బీఆర్ఎస్ నుంచి నిర్దాక్షణ్యంగా వెళ్లగొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పదవుల కోసం పార్టీ పెట్టలేదని తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోసం పంతం పట్టి పార్టీ పెట్టానని అన్నారు. పార్టీ ఏర్పాటు చేసిన 4 నెలల తర్వాత సొంతూరు నిజామాబాద్ కు రావటం సంతోషంగా ఉందని కవిత అన్నారు. గతంలో ఎంపీగా, ఎమ్మెల్సీ ఏ విధంగా ఆశీర్వాదం ఇచ్చారో ఇప్పుడు కూడా అదే ఆశీర్వాదం ఇవ్వాలని కవిత నిజామాబాద్ ప్రజలకు విజ్ఞప్తి ...

ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత

Image
*ఇంటి ఆడబిడ్డగా వధువు మెడలో తాళి కట్టిన కల్వకుంట్ల కవిత* తెలంగాణ రక్షణ సేన నాయకుడు తన వివాహం పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత చేతుల మీదుగా జరగాలని ఆకాంక్షించాడు. తన ఇంటి ఆడబిడ్డ హోదాలో ఉండి పెళ్లి చేయాలని కోరాడు. ముదిరాజ్ సంప్రదాయం ప్రకారం పెళ్లికూతురు మెడలో తాళి కట్టాలని కోరాడు. పార్టీ నాయకుడి ఆకాంక్షను గౌరవించి ముదిరాజ్ ఇంటి ఆడబిడ్డగా మారి ఆ నాయకుడి ఆకాంక్షను నెరవేర్చారు కల్వకుంట్ల కవిత. ఈ వేడుకకు ఈసీఐఎల్ - కీసర క్రాస్ రోడ్డులో ఆరాధ్య కన్వేషన్ వేదికగా నిలిచింది. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు గ్రామానికి చెందిన బాషబోయిన బాలప్రసాద్ తెలంగాణ రక్షణ సేన నాయకుడు. తెలంగాణ జాగృతిలోనూ క్రియాశీలంగా పని చేశాడు. బాలప్రసాద్ కు సీతాఫల్ మండికి చెందిన శివానితో వివాహం నిశ్చయం అయింది. బుధవారం ఉదయం బాలప్రసాద్ - శివాని వివాహ ముహూర్తం కాగా తనకు అక్కాచెల్లెళ్లు లేకపోవడంతో బాలప్రసాద్ కోరిక మేరకు వారి ఇంటి ఆడబిడ్డగా కవిత వ్యవహరించారు. ముదిరాజ్ కులాచారం ప్రకారం వరుడు వధువుకు తాళి కట్టే ముందు ఆడపడుచుతో పసుపు కొమ్ముతో మూడు ముళ్ళు వేయిస్తారు. వారి సంప్రదాయం ప్రకారం కవిత గౌరీ పూజలో పాల్గొని వధువు శివాని మెడలో ...

లోపల దోస్తీ.. బయట కుస్తీ.. కాంగ్రెస్, బీజేపీ బంధంపై ఇందూర్‌లో చర్చ

Image
లోపల దోస్తీ-బయట కుస్తీ కాంగ్రెస్,బీజేపీ బంధం ...... (జమాల్పూర్ గణేష్/మూల్పూరు రాజేంద్రబాబు) బీజేపీ,కాంగ్రెస్ ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైంది ..దీనికి ఇందూర్ వేదిక అయ్యింది.. ప్రభుత్వంలో కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు రోజుల నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రెండు రోజుల కార్యక్రమాల్లో బీజేపీ MLA లు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త,రాకేష్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదటి రోజు ఆర్ముర్ MLA రాకేష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి నిజామాబాద్ లో నిర్మించిన పైడి కన్వెన్షన్ ను పొంగులేటి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.. అదేరోజు రాకేష్ రెడ్డి స్వగ్రామం అంకపూర్ వెళ్లిన మంత్రి MLA ఆథిత్యాన్ని స్వీకరించారు. అదే ఊరిలో ఆర్ముర్ అసెంబ్లీ ఇంచార్జి, రాకేష్ రెడ్డితో రాజకీయ పోరు చేస్తున్న వినయ్ రెడ్డి లేకుండానే డబుల్ బెడ్ రూమ్స్ ను పరిశీలించారు మంత్రి పొంగులేటి.. శనివారం ఉదయం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమావేశంలో అర్బన్ MLA గుప్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తారు.. అర్బన్ లో 1O ఏళ్లలో ఒక్కఇల్లు ఇవ్వలేదని BRS పై నిప్పులు చెరిగారు. అంతటితో ఆగకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకా...

మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్ల కోసం పోరాడాలి: పోచబోయిన శ్రీహరి యాదవ్

Image
**మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్లు సాధించుకుందాం** **పోచబోయిన శ్రీహరి యాదవ్ పిలుపు** ఆగస్టు 7 మండల్ డే ను పురస్కరించుకొని నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీపీ మండల్ విగ్రహ ప్రతిపాదిత స్థలం (బీజేఆర్ చౌరస్తా )లో బిపి మండల్ చిత్రపటానికి వివిధ కుల ప్రజా సంఘాల నాయకులతో కలిసి పూలమాలవేసిన అనంతరం సామాజిక ప్రజాస్వామ్యవాదుల సమాఖ్య(SDF)చైర్మన్ శ్రీ పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు మాట్లాడుతూ 36 ఏళ్ల క్రితం 1990 ఆగష్టు 7 న భారత పార్లమెంట్ ఆమోదించిన మండల కమిషన్ సిఫారసులు నేటికీ అమలు నోచుకోకపోవడం ఓబీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ దేశంలోని పాలకవర్గ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధికి ఓబీసీల పట్ల ఉన్న వివక్షతకు నిదర్శనమన్నారు. ఒకవైపు సకల సామాజిక రంగాలలో మేము ఎంతమందిమో మాకు అంత వాటాకావాలంటూ ప్రజలు పోరాడుతుంటే కనీసం ఉన్న హక్కులను కూడా కాలరాసే విధంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు కార్పోరేట్ కంపెనీలకు ఈ దేశ సంపదని సామ్రాజ్యవాదులకి దోచిపెడుతూ నిజమైన భూమిపుత్రులైన సకల సంపదల సృష్టికర్తలైన ఓబీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారని మరోవైపు రిజర్వేషన్ హటావో పేరుతో ఇప్పటిక...

ఆగస్టు 6న గద్దర్ వర్ధంతి సభలు విజయవంతం చేయండి.. పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ

Image
  6న గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయండి..  పోస్టర్ ఆవిష్కరించిన గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ.. సిద్దిపేట, ఆగస్టు 3. ఈనెల 6 న సిద్దిపేటలో, హైదరాబాద్ లో జరిగే ప్రజాయుద్ధ నౌక గద్దర్ వర్ధంతి సభను విజయవంతం చేయాలని గద్దర్ విగ్రహ నిర్మాణ కమిటీ పిలుపునిచ్చింది. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో వర్ధంతి సభ పోస్టర్ ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. కార్యక్రమం లో కమిటీ చైర్మన్ పోచబోయిన శ్రీహరి, కో చైర్మన్ ఆస లక్ష్మణ్,TPTF రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ జి. తిరుపతి రెడ్డి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్షులు కె. రంగాచారి, ప్రజాగాయకులు భీమసేన, చికోటి నర్సింలు, అవని పత్రిక సంపాదకులు కూతురు రాజిరెడ్డి, పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మంజీరా రచయితల సంఘం ప్రధానకార్యదర్శి సిద్దెంకి యాదగిరి, తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షులు పొన్నాల బాలయ్య,BC సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కంకిటి నవీన్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు దాస అంజయ్య, BRS నాయకులు గుండు శ్రీనివాస్, తెలిజీరు శ్రీనివాస్ యాదవ్, గడీల రమేష్ రెడ్డి, చిటుకుల మైసా రెడ్డి తదితరులు కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు.ఈ ...

అఖిల వైద్య విద్యకు హరీష్ రావు భరోసా.. ఎంబీబీఎస్ ఫీజులన్నీ నేనే భరిస్తా అని హామీ

Image
• అఖిల వైద్య విద్యకు హరీష్ రావు భరోసా .................. • నాలుగేళ్ల క్రితం తండ్రి చనిపోవడంతో హరీష్ రావును ఆశ్రయించిన అఖిల. • 9వ తరగతి నుండి ఇంటర్ పూర్తయ్యే దాకా మెరీడియన్ విద్యాసంస్థల్లో చదివించిన మాజీమంత్రి . • ఇటీవల డాక్టర్ చదువు కోసం నీట్ పరీక్ష రాసిన అఖిల. • తన ఇంటికి ఆత్మీయంగా ఆహ్వానించడమేగాక అన్నం పెట్టి ఆత్మీయ భరోసా అందించిన మాజీ మంత్రి. • ఎంబీబీఎస్ సీటు ఎక్కడ వచ్చినా తానే ఫీజు కట్టి చదివిస్తానని మనోధైర్యం కల్పించిన హరీష్ రావు గారు. • తండ్రి ని కోల్పోయి ఆర్థిక స్థోమత లేక ఆందోళన లో ఉన్న నిరుపేద బిడ్డకు అండగా హరీష్ రావు గారు • పేద విద్యార్థులకు పెద్దదిక్కుగా నిలిచి మరో సారి మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు. " హరీష్ రావు గారు ఓ మానవత్వ శిఖరం.. ఆపదలో అదుకొనే అపద్భాందవుడు... అన్న ల ఆత్మీయత నీచ్చే నాయకుడు.. అభివృద్ధి కి నిలువుటద్దం ఆయన.. కష్టం వచ్చింది అంటే నేను ఉన్న అని భరోసా నిచ్చే నేత... సిద్దిపేట కుటుంబ సభ్యుడిగ నిత్యం ప్రజల కష్టాలు, బాధలు తీర్చే ప్రజా నాయకులు ఇలా హరీష్ రావు గారి గురించి ఇలా ఎన్ని పేర్లు చెప్పుకున్న సరిపోనంత అభిమానం చాటుక...

ఎస్సారెస్పీని సందర్శించిన మంత్రులు.. వరద ప్రవాహం, నీటి నిల్వలపై సమీక్ష

Image
నిజామాబాద్, ఆగస్టు 01 : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను శనివారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని (ఇన్ ఫ్లో) పరిశీలించారు. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బాలేగాం, బాబ్లీ బ్యారేజీలతో పాటు కడెం తదితర ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి ద్వారా వచ్చి చేరుతుండటంతో ఎస్సారెస్పీలో నీటి మట్టం పెరిగిందని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇప్పటికిప్పుడు వర్షాలు నిలిచిపోయినా, మరో 48 గంటల వరకు వరద నీరు ఇన్ ఫ్లో రూపంలో వస్తుందని అన్నారు. ఈ సంద...