నిజామాబాద్లో హనీ ట్రాప్ గుట్టురట్టు.. కిలాడి దంపతుల అరెస్టు
హనీ ట్రాప్ సంఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది.పురుషుల బలహీనతను అలుసుగా చేసుకుని వలపు వల విసిరి హనీట్రాప్ కు పాల్పడుతున్న మహిళను పోలీసులు వల పట్టుకున్నారు. ఒంటరిగా ఉన్న మగ వారిని ముగ్గులోకి దించుతూ.. డబ్బులు ఇవ్వ కుంటే కేసులో ఇరికిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న భార్యభర్తలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ రూరల్ పీఎస్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముథ్కేడ్ తాలూ కా ముక్రంబాద్ గ్రామానికి చెందిన మంగేశ్ గైక్వాడ్, ఉజ్వల గైక్వాడ్ దంపతులు. వీరు రెండు నెలల క్రితం మాధవనగర్ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. ఉజ్వల గైక్వాడ్ కంఠేశ్వర్ బైపాస్, ఆర్మూర్ రోడ్డు ప్రాంతంలో రోడ్డు పక్కన నిల బడి ఒంటరిగా వెళ్తున్న మగవారికి సైగలు చేసే ది. ఆమెను చూసి ఆమె దగ్గరకు వచ్చిన మగ వారిని తాను వ్యభిచారం చేస్తానని డబ్బులు ఒంటరిగా ఉన్న మగవారిని ముగ్గులోకి దించుతూ అక్రమ వసూళ్లు చేసి మాట్లాడుకొని అతని బైక్ పై కూర్చుని నిర్మా నుష్య ప్రదేశానికి తీసుకువెళ్లేది. అప్పటికే వీరు వెళ్తున్న బైక్ను వెనకాల నుంచి ఆమె భర్త మంగేశ్ గైక్వాడ్ ఫాలో చేసేవాడు. ...