Posts

Showing posts with the label Auto Rally

ఆటో కార్మికుల సమస్యలపై గణేష్ బిగాల భారీ ర్యాలీ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Image
ప్రజా వంచన పాలనఇది -బిగాల గణేష్ ఆగ్రహం నిజామాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన, నెరవేర్చని హామీలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో గణేష్ బిగాల ఆదివారం భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన వీధుల గుండా ఆటో కార్మికులతో కలిసి ఈ నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన పూర్తిగా కుప్పకూలిందని, ప్రజా సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నిర్ణయాల వల్ల ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిని, వారి పొట్ట కొట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఆదాయం లేక నిత్యం తిండికి కూడా ఇబ్బందులు పడుతూ, పలువురు ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో సోదరులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, నగరంలో పారిశుధ్య లో...