Posts

Showing posts with the label Geetha Workers

గీత కార్మికుల కోసం బడ్జెట్‌లో ₹5000 కోట్లు

Image
రాష్ట్ర బడ్జెట్లో కల్లుగీత కార్మికులకు 5000 కోట్లు కేటాయించాలని వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ ఇందిరా పార్క్ లో జరిగే మహాధర్నాను జిల్లాలో ఉన్న గీత కార్మికులు తరలి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కోయడి నర్సింహులు అధ్యక్షతన సోమవారం స్థానిక R&B గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కల్లుగీత కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర బడ్జెట్లో గీతా కార్మికులకై ఐదు వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.గీత కార్మికులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలని, ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ ని 4000 చేయాలని, ఎక్స్గ్రేషియా ను 10 లక్షలకు పెంచాలని కోరారు. అలాగే సేఫ్టీ కిట్స్ ఇవ్వాలని తీర్మానం చేసింది సమావేశం. సమస్యల పరిష్కారానికై రేపు హైదరాబాదులోని ఇందిరాపార్క్ లో జరిగే మహా ధర్నా,అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దీనిలో KGKS జిల్లా కార్యదర్శి చిడుగు శేఖర్ గౌడ్, కోశాధికారి శ్రీరాం గౌడ్, సాయగౌడ్ తో పాటు ఈ సమావేశం వివిధ గీత వృత్తి సంఘ ప్రతినిధులు ఎనుగందుల మురళి,నారా గౌడ్ శ్రీనివాస్, కృష్ణాగౌ...