Posts

Showing posts with the label Rajguru

భగత్ సింగ్ గొప్ప యోధుడు -పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

Image
స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి నిత్యం స్మరించుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పిలుపునిచ్చారు. మన దేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలను సైతం నవ్వుతూ వదులుకున్న ఎందరో మహనీయుల త్యాగాలను భారతీయులందరూ ప్రతినిత్యము స్మరించుకోవాలని అన్నారు ఆయన. మార్చ్ 23న నవ యువకులైన దేశభక్తులు భగత్ సింగ్ ,రాజ్ గురు, సుఖదేవ్ ల ప్రాణత్యాగానికి గుర్తుగా సమర్పణ దివస్ కార్యక్రమాన్ని కేంద్ర యువజన క్రీడా మంత్రిత్వ శాఖ మేరా యువ భారత్ ఆధ్వర్యంలో సోమవారం పాలిటెక్నిక్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కులాలు, మతాలు ప్రాంతాలు వేరువేరుగా ఉన్నప్పటికీ భారతీయులందరూ ఒకే తల్లి బిడ్డల్లాగా కలిసి ఉండటమే మన స్వతంత్ర సమరయోధుల యొక్క జీవిత ఆశయమని గుర్తు చేశారు, ప్రాణ త్యాగానికి మించిన గొప్ప త్యాగం ఇంకేది ఉండదని ,అలాంటిది వేలాదిమంది స్వాతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను ఈ దేశం కోసం వదిలిపెట్టారని ఆయన తెలిపారు. నవ యువకులుగా ఉన్న అతిపిన్న వయసు గల యువకులు భగత్ సింగ్ అతని స్నేహితులు రాజ్ గురు, సుఖదేవ్ లు ఉరి కొయ్యలను సైతం నవ్వుతూ ముద్దాడి మెడలో వేసుకున...