Posts

Showing posts with the label Ravindra Bharathi

వందేమాతరం సామూహిక గీతాలాపన..

Image
వందేమాతరం సామూహిక గీతాలాపనకు వేదిక కానుంది హైదరాబాద్ రవీంద్రభారతి. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వందేమాతరం సామూహిక గీతా లాపనకు రిహార్సల్ పూర్తి అయ్యింది. హైదరాబాద్ లోని ఈస్టు మారెడ్పల్లి భక్త రామదాసు నృత్య,సంగీత ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు ఈ సామూహిక గీతాన్ని ఆలపించేందుకు కాలేజీ ప్రిన్సిపాల్ మహావాది సరిత నేతృత్వంలో రిహార్సల్స్ పూర్తి అయ్యాయి.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంకింగ్ చంద్ర రాసిన వందే మాతరం దేశ భక్తి పాట 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సామూహిక గీతా లాపన కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ గీతాలాపనకు లెక్చరర్లు అనిల్ కుమార్, నాగేశ్వర్ రావ్,ప్రశాంత్ వాద్య సహకారం అందచేస్తారని సరిత వివరించారు.. . రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, డైరెక్టర్ పాల్గొంటారు.. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel