Posts

Showing posts with the label Rythu Bharosa

హరీష్ రావు అడ్డాలో మార్పు జపం

Image
BRS బాహుబలి హరీష్ రావు అడ్డా అయిన సిద్దిపేట గడ్డమీద సీఎం రేవంత్ రెడ్డి మార్పు మంత్రం వల్లించారు. ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం ఒక్కసారి సిద్దిపేట లో సిట్టింగ్ MLA హరీష్ రావు కు బదులు కాంగ్రెస్ ను గెలిపించాలని సిద్దిపేట ఓటర్లను అభ్యర్తించారు. హరీష్ రావు చెబుతున్నట్లు సిద్దిపేట మీద వివక్ష చూపలేదన్నారు సీఎం.10 ఏళ్ల BRS పాలనలో నా కొడంగల్ మీద వివక్ష చూపారని ఎదురు దాడికి దిగారు రేవంత్ రెడ్డి. ప్రసంగం మొత్తం హరీష్ రావు చుట్టే సాగడం విశేషం.. ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మీట నొక్కి రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేశారు. నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత జిల్లాలో 775 కోట్...