Posts

Showing posts with the label Telangana Udyamakaarulu

పీసీసీ చీఫ్ తో తెలంగాణ ఉద్యమకారుల భేటీ

Image
నిజామాబాద్; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముందువరుసలో ఉన్న ఉద్యమకారుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రతినిధి బృందం కలిసింది. అక్రమ కేసులు, నిర్బంధాలు ఎదుర్కొని తెలంగాణ సాధనలో పనిచేసిన ఉద్యమకారులు నిరాదరణకు గురవుతున్నారని మహేష్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల ప్రణాళికను ఆచరణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సొంతింటి కోసం 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షున్ని కోరారు. ఫించన్లు ఇచ్చి ఆదుకోవాలను కోరారు. మహేష్ కుమార్ గౌడ్ ను కలసిన ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షుడు యెండల ప్రదీప్ తోపాటు పుప్పాల రవి,శ్రీనివాస్ గౌడ్,పులి జైపాల్, మేతిరి రాజశేఖర్,జ్వాల రాణి, బర్రికుంట శ్రీనివాస్,సల్ల ప్రవీణ్ ఉన్నారు.