Posts

Showing posts with the label Temple Attack Nizamabad

గోపాల్ బాగ్ శివాలయంలో విగ్రహాల ధ్వంసం ఘటనపై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా ఆగ్రహం

Image
ఇందూర్ (నిజామాబాద్) అర్బన్: నగరంలోని గోపాల్ బాగ్ ప్రాంతంలో ఉన్న పురాతన శివాలయంలో ఇటీవల జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనపై నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై జరుగుతున్న దాడులు హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆయన అన్నారు. హిందువులు ఇప్పటివరకు శాంతియుతంగా ఉన్నప్పటికీ ఇలాంటి ఘటనలు కొనసాగితే పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని ఎమ్మెల్యే హెచ్చరించారు. “ఒక్కసారి కాషాయ దళం రెచ్చిపోతే జరిగే పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుంది” అని ఆయన పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసుల వైఫల్యం గోపాల్ బాగ్‌లోని పురాతన శివాలయంలో మూడు రోజుల క్రితం జరిగిన విగ్రహాల ధ్వంసం ఘటనపై ఇప్పటివరకు నిందితులను గుర్తించలేకపోవడం విచారకరమని ఎమ్మెల్యే విమర్శించారు. పోలీసులు ఇప్పటికీ ఎవరు చేశారు అనే విషయం కనుగొనలేకపోయామని చెప్పడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు. ఆలయ స్థలాలపై కబ్జాల ఆరోపణలు ఈ ప్రాంతంలో ఉన్న సుమారు 80 ఎకరాల శివాలయ భూమిపై కొందరు కబ్జాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే ఆరో...