Posts

Showing posts with the label borewells

భూగర్భానికి రీఛార్జ్... నెలకో మీటర్ లోతుకు జలమట్టాలు... ఆదా చెయ్యకపోతే అదొగతే...!

Image
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. తద్వారా భూగర్భ జలాలు ఆవిరి అధికమవుతున్నాయి. దీనికి తోడు లక్షలాది వ్యవసాయ బోరు బావులు పంటల నిమిత్తం నీటిని పొలాల్లోకి సాగునీరుగా వాడుకుంటున్నారు రైతులు. ఇక గృహ అవసరాల నిమిత్తం ఏర్పాటు చేసుకునే బోర్లు కోట్ల లీటర్ల నీటిని లాగేస్తున్నాయని భూగర్భ జల శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ బాబు పేర్కొన్నారు. ప్రాజెక్టులు జలాశయాల్లోని నీటిని త్రాగునీటి కోసం సాగు అవసరాల కోసం వాడుతూనే ఉన్నాం అయితే వర్షాలు కురిసే శాతం తగ్గిపోవడంతో భూగర్భ రీఛార్జ్ కావడం లేదని, జలవినియోగంపై ఇంకుడు గుంటల కై వాటి ఏర్పాటు చేయడం వాటిపై దృష్టి సారించడం లేదన్నారు.దీంతో నెలకు మీటర్ లోతున నీరు ఖాళీ అవుతుంది ఈ మేరకు భవిష్యత్తులో త్రాగునీరు, సాగునీటి లభ్యత ప్రశ్నార్థకమవుతుంది. ఈ అంశంపై జిల్లా భూగర్భ జల శాఖ అధికారి శ్రీనివాస్ బాబు మన నిజామాబాద్ ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. వారు ఏమంటున్నారు వారి మాటల్లోనే విందాం.. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Cha...