Posts

Showing posts with the label collector

నల్లాలకు ఆన్లైన్ బూస్టర్ సిస్టమ్స్ కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడి

Image
నిజామాబాద్, జిల్లాలోని ప్రతి నివాస ప్రాంతంలో ప్రజల అవసరాలకు సరిపడా సమృద్ధిగా తాగునీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి. అధికారులకు సూచించారు. ప్రస్తుత వేసవిలో ఎక్కడ కూడా దాహార్తి సమస్య తలెత్తకుండా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని అన్నారు. బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బోధన్ బాన్సువాడ నియోజకవర్గాల పరిధిలోని మండలాల ఎంపీడీఓలు, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏ.ఈలు, ఎం.పీ.ఓ లు ఇతర అధికారులతో కలెక్టర్ మంచినీటి సరఫరా స్థితిగతులపై సమీక్ష నిర్వహించారు.       ఒక్కో మండలం వారీగా నీటి సరఫరా పరిస్థితి గురించి, అందుబాటులో ఉన్న నీటి వనరులు, చేపట్టాల్సి ఉన్న మరమ్మతులు తదితర వాటి గురించి అడిగి తెలుసుకున్నారు.     వేసవి సీజన్ ను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సరఫరా వ్యవస్థను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు. రానున్న రెండు మూడు నెలలు ఎంతో కీలకమైనందున, నీటి సరఫరా విషయంలో ఏ దశలోనూ నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తతతో వ్యవహరించాలని అన్నారు. ఏ ఒక్క నివాస ప్రాంతంలోనూ నీటి కొరత ఏర్పడకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ, అవసరమైన చోట య...

నిప్పుల కొలిమిలో నిజామాబాద్: చౌరస్తాలో నిమిషం ప్రయాణం.. నరకానికి నిదర్శనం!

Image
ఏప్రిల్ నెలలోనే ఇందూరు నగరం అగ్నిగుండంలా మారుతోంది. ఆకాశం నుండి కురుస్తున్న నిప్పుల వడగళ్ళు, ఉక్కపోతతో ప్రజల ఊపిరి ఆగిపోయే పరిస్థితి నెలకొంది. ఈ ఎండల ధాటికి సామాన్యుడు బయటకు రావాలంటేనే వణికిపోతున్నాడు. రోడ్లపై ప్రయాణం ఒక ఎత్తయితే.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఎదురుచూడటం ఒక మానవీయ సంక్షోభంగా మారుతోంది. 🚦 ఎర్రటి సెగలు.. కరుగుతున్న ప్రాణాలు సిగ్నల్ దగ్గర పడే ఆ 90 సెకన్ల రెడ్ లైట్, వాహనదారులకు శిక్షలా మారుతోంది. చిన్నారుల ఆక్రందనలు: బైకుపై వెళ్లే పసిపిల్లల సున్నితమైన చర్మం ఆ వేడికి కాలిపోతుంటే, వారి ఏడుపు తండ్రి గుండెను పిండేస్తోంది. వృద్ధుల అవస్థలు: శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ, ఎండ దెబ్బకు తూలిపోతున్న ముసలి ముతక ప్రజలు.. గ్రీన్ సిగ్నల్ పడగానే "హమ్మయ్య బతికిపోయాం" అని ఊపిరి పీల్చుకుంటున్నారు. రోగుల ఆర్తనాదాలు: హాస్పిటల్ కి వెళ్లే అత్యవసర స్థితిలో ఉన్నవారు, సిగ్నల్ వద్ద ఆ ఒక్క నిమిషం వేడిని భరించలేక విలవిలలాడుతున్నారు. మనుషుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేంతటి తీవ్రమైన ఈ పరిస్థితిపై 'మన నిజామాబాద్ ఛానల్' తన సామాజిక బాధ్యతగా మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల దృష్టికి...

కస్తూర్బా బాలికల విద్యాలయంను సందర్శించిన కలెక్టర్

Image
నిజామాబాద్,  వర్ని మండలం కోటయ్య క్యాంపులో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు.       పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. విద్యార్థులకు సిద్ధం చేసిన మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను లోనికి అనుమతించకూడదని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అనంతరం 7వ తరగతి గదిని కలెక్టర్ సందర్శించి, విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన డైరీలు, చాక్లెట్లు, బహుమతులను అందించారు. చక్కగా చదువుకోవాలని, అదే సమయంలో వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచ...