Posts

Showing posts with the label gajwel news

కేసీఆర్ కార్యాలయంపై దాడికి మూల్యం తప్పదు

Image
నిజామాబాద్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కేసీఆర్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల భౌతిక దాడిన తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ భారాస లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ సారతి, తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యాలయం అని తెలిసి కుట్రపూరితంగా మూకుమ్మదిగా దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వసం చేయడం క్షమించరాని నేరంగా ఆయన అభివర్ణించారు.భారాస నాయకులపైన కుట్రలు చేస్తూ దాడులు చేయడం కాంగ్రెస్ విషసంస్కృతిలో బాగమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టే శక్తియుక్తులు భారాసకు ఉన్నాయని, భారాస శ్రేణుల బలం ముందు కాంగ్రెస్ పలాయనం కాకతప్పదని ఆయన హెచ్చరించారు. గజ్వేల్ తెలంగాణ రాష్ట్రం కోసం గజ్జెకట్టి కదిలిన చరిత్ర ఉన్నదని మరొకసారి గజ్జెకట్టి కదిలితే కాంగ్రెస్ కాలగర్భంలో కలిసి పోతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడులను , కాంగ్రెస్ ను అంధపాతాలానికి తొక్కివేసె బలం గజ్వేల్ ప్రజల సొంతమని, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతే కొలమాణంగా భారాస కదిలి కాంగ్రెస్ ను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తుందని...