Posts

Showing posts with the label womens day celebration nizamabad

ప్రతి రంగంలో మహిళలకు భాగస్వామ్యం కల్పించాలనీ వక్తల పిలుపు

Image
మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో ముందుకు రావాలని ప్రతిభను కనబరచాలని, మహిళలు అన్ని రంగాల్లో గౌరవింపబడాలని వక్తలు పిలుపునిచ్చారు. బుధవారం నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి, న్యాయవాది, పి పి నీరజ రెడ్డి, ప్రముఖ వైద్యురాలు బండారి సుజాత, అర్బన్ సిడిపిఓ సౌందర్య, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ స్పెషల్ స్కూల్ ప్రిన్సిపల్స్ జ్యోతి, రాజేశ్వరి, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత హాజరయ్యారు. మొదట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ప్రెస్ క్లబ్లో ఆనవాయితీగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను జరుపుతున్నామన్నారు. ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల ఉమారాణి మాట్లాడుతూ.. మహిళలు ఎక్కడ పూజింపబడతారో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. మహిళల పాత్ర లేనిదే సమాజ మనుగడ ముందుకు సాగద...