Posts

Showing posts with the label LPG Supply

నిజామాబాద్‌లో LPG, పెట్రోల్, డీజిల్ సరఫరాలు సాధారణం.. ప్రజలు ఆందోళన చెందొద్దు - జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి

Image
* ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో LPG, పెట్రోల్ మరియు డీజిల్ సరఫరాలపై సమీక్ష నిర్వహించబడింది. 👉 ప్రస్తుత పరిస్థితి: * జిల్లాలో సరఫరాలు సాధారణంగా కొనసాగుతున్నాయి * ఎటువంటి కొరత లేదు * సరిపడా నిల్వలు అందుబాటులో ఉన్నాయి ⚠️ అయితే జాగ్రత్త చర్యలు తీసుకోవాలి *అన్ని డిస్ట్రిబ్యూటర్లు / అధికారులు తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు: * LPG సిలిండర్లకు తగిన నిల్వలు (7–10 రోజులు) ఉంచాలి * బుకింగ్ మరియు డెలివరీలో విలంబం లేకుండా చూడాలి * గృహ వినియోగ గ్యాస్‌ను వాణిజ్య వినియోగానికి మళ్లించరాదు * స్టాక్ వివరాలు స్పష్టంగా ప్రదర్శించాలి * ప్రతి రోజు స్టాక్ & సరఫరా నివేదికలు సమర్పించాలి పెట్రోల్ & డీజిల్: * అన్ని బంకుల్లో స్టాక్ అందుబాటులో ఉండాలి * ఎటువంటి స్టాక్ అవుట్ పరిస్థితి రాకుండా చూడాలి * ధరలు మరియు స్టాక్ వివరాలు ప్రదర్శించాలి ఎన్‌ఫోర్స్‌మెంట్: * అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్ పై కఠిన చర్యలు * అవసరమైతే రైడ్లు నిర్వహించాలి ప్రజలకు విజ్ఞప్తి: * అవసరానికి మించి నిల్వలు చేయవద్దు * గ్యాస్ / ఇంధన కొరతపై భయపడవద్దు 👉 జిల్లా ...

3 నెలలకు సరిపడా పెట్రోల్,డీజిల్ ఉంది. -మంత్రి ఉత్తమ్

Image
-మంత్రి ఉత్తమ్ హైదరాబాద్. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్,ఎల్.పి.జి కొరత ఉత్పన్నమయ్యే ప్రసక్తేలేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా హైదరాబాద్ లో డీజిల్,పెట్రోల్ బంక్ ల వద్ద పెద్ద ఎత్తున ఉన్న క్యూలను చూసి పెట్రోల్,డీజిల్,ఎల్.పి.జి కొరత అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఇంధన వనరులతో పాటు ఎల్.పి.జి కొరత అంటూ వస్తున్న వదంతులతో ప్రజాలేవరు గందరగోళంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఈ మేరకు రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో పౌర సరఫరాల శాఖా కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తో కలసి ఆయన మీడియాతో ముచ్చటించారు. రానున్న మూడు నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని జరుగుతున్న వదంతులతో ఏ ఒక్కరూ అయోమయంలో పడొద్దని ఆయన ఉద్బోధించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్,భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ తో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీలు ఇంధన సరఫరాలను గణనీయంగా పెంచాయని ఆయన పేర్కొన్నారు. డిమాండ్ నీ మించి సరఫరా కొనసాగుతోందని,ఈ రోజు 17,246 కిలో లీటర్ల డిమాండ్ ఉండగా 17,898 కిలోలీటర్ల సరఫరా జరగడమే ఇందుకు నిదర్శనమన్నారు.అంటే ...