Posts

Showing posts with the label Mandal Day

మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్ల కోసం పోరాడాలి: పోచబోయిన శ్రీహరి యాదవ్

Image
**మండల్ డే స్ఫూర్తితో ఓబీసీల రిజర్వేషన్లు సాధించుకుందాం** **పోచబోయిన శ్రీహరి యాదవ్ పిలుపు** ఆగస్టు 7 మండల్ డే ను పురస్కరించుకొని నేడు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బీపీ మండల్ విగ్రహ ప్రతిపాదిత స్థలం (బీజేఆర్ చౌరస్తా )లో బిపి మండల్ చిత్రపటానికి వివిధ కుల ప్రజా సంఘాల నాయకులతో కలిసి పూలమాలవేసిన అనంతరం సామాజిక ప్రజాస్వామ్యవాదుల సమాఖ్య(SDF)చైర్మన్ శ్రీ పోచబోయిన శ్రీహరి యాదవ్ గారు మాట్లాడుతూ 36 ఏళ్ల క్రితం 1990 ఆగష్టు 7 న భారత పార్లమెంట్ ఆమోదించిన మండల కమిషన్ సిఫారసులు నేటికీ అమలు నోచుకోకపోవడం ఓబీసీల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ దేశంలోని పాలకవర్గ పార్టీలకు ఉన్న చిత్తశుద్ధికి ఓబీసీల పట్ల ఉన్న వివక్షతకు నిదర్శనమన్నారు. ఒకవైపు సకల సామాజిక రంగాలలో మేము ఎంతమందిమో మాకు అంత వాటాకావాలంటూ ప్రజలు పోరాడుతుంటే కనీసం ఉన్న హక్కులను కూడా కాలరాసే విధంగా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు కార్పోరేట్ కంపెనీలకు ఈ దేశ సంపదని సామ్రాజ్యవాదులకి దోచిపెడుతూ నిజమైన భూమిపుత్రులైన సకల సంపదల సృష్టికర్తలైన ఓబీసీలకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తున్నారని మరోవైపు రిజర్వేషన్ హటావో పేరుతో ఇప్పటిక...