రణరంగంగా మారిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్
కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన మున్సిపల్ కార్మికులు పరిస్థితి ఉద్రిక్తం ధర్నా కార్యక్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్న మహిళా కార్మికులు మన నిజామాబాద్ అర్బన్.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ సిపిఐ సిపిఎం ఎ టి యు సి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం రణరంగంగా మారింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు కార్మికులు బైఠాయించి సుమారు అరగంటసేపు నిరసన తెలిపారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి వదిలి వెళ్లాలని కోరారు. దీంతో కార్మికులు అంతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మెట్లపై కూర్చుని సైతం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడ నుండి వెల్లబోమని బీస్మించుకొని కూర్చుండి పోయారు. అయితే ఇది ఇలా ఉండగా రెండవ అంతస్తులో ఉండే డిప్యూటీ కమిషనర్ను కలిసి తమ సమస్యను విన్నవించడానికి వెళ్లిన మహిళా కార్మికులు డిప్యూటీ కమిషనర్ తలుపు మూసి ఉంచటంతో వాటిని తెరవాలని చేతులతో బాధదంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు మహిళలు అపస్మారక స్థితికి చేరుకొని పడి...