Posts

Showing posts with the label Rakesh Reddy

లోపల దోస్తీ.. బయట కుస్తీ.. కాంగ్రెస్, బీజేపీ బంధంపై ఇందూర్‌లో చర్చ

Image
లోపల దోస్తీ-బయట కుస్తీ కాంగ్రెస్,బీజేపీ బంధం ...... (జమాల్పూర్ గణేష్/మూల్పూరు రాజేంద్రబాబు) బీజేపీ,కాంగ్రెస్ ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైంది ..దీనికి ఇందూర్ వేదిక అయ్యింది.. ప్రభుత్వంలో కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెండు రోజుల నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రెండు రోజుల కార్యక్రమాల్లో బీజేపీ MLA లు ధన్పాల్ సూర్యనారాయణ గుప్త,రాకేష్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొదటి రోజు ఆర్ముర్ MLA రాకేష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి నిజామాబాద్ లో నిర్మించిన పైడి కన్వెన్షన్ ను పొంగులేటి ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.. అదేరోజు రాకేష్ రెడ్డి స్వగ్రామం అంకపూర్ వెళ్లిన మంత్రి MLA ఆథిత్యాన్ని స్వీకరించారు. అదే ఊరిలో ఆర్ముర్ అసెంబ్లీ ఇంచార్జి, రాకేష్ రెడ్డితో రాజకీయ పోరు చేస్తున్న వినయ్ రెడ్డి లేకుండానే డబుల్ బెడ్ రూమ్స్ ను పరిశీలించారు మంత్రి పొంగులేటి.. శనివారం ఉదయం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమావేశంలో అర్బన్ MLA గుప్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆకాశానికి ఎత్తారు.. అర్బన్ లో 1O ఏళ్లలో ఒక్కఇల్లు ఇవ్వలేదని BRS పై నిప్పులు చెరిగారు. అంతటితో ఆగకుండా ఇందిరమ్మ ఇళ్ల పథకా...