ఎస్సారెస్పీని సందర్శించిన మంత్రులు.. వరద ప్రవాహం, నీటి నిల్వలపై సమీక్ష
నిజామాబాద్, ఆగస్టు 01 : నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ లో గల శ్రీరాంసాగర్ రిజర్వాయర్ ను శనివారం రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐ.టీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు, మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తదితరులు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సందర్శించారు. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలతో ఎగువ ప్రాంతం నుండి ప్రాజెక్టులోకి వచ్చి చేరుతున్న వరద ప్రవాహాన్ని (ఇన్ ఫ్లో) పరిశీలించారు. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని పరిశీలించి ప్రాజెక్టుకు చెందిన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎగువన గల గైక్వాడ్, విష్ణుపురి ప్రాజెక్టులు, బాలేగాం, బాబ్లీ బ్యారేజీలతో పాటు కడెం తదితర ప్రాజెక్టుల మిగులు జలాలు గోదావరి ద్వారా వచ్చి చేరుతుండటంతో ఎస్సారెస్పీలో నీటి మట్టం పెరిగిందని అధికారులు మంత్రుల దృష్టికి తెచ్చారు. ఇప్పటికిప్పుడు వర్షాలు నిలిచిపోయినా, మరో 48 గంటల వరకు వరద నీరు ఇన్ ఫ్లో రూపంలో వస్తుందని అన్నారు. ఈ సంద...