Posts

Showing posts with the label TJS Party

తెలంగాణ జన సమితిలో చేరిన బాస రమేష్ యాదవ్.. కోదండరాం సమక్షంలో పార్టీలోకి ఆహ్వానం

Image
తెలంగాణ జన సమితిలో బాస రమేష్ యాదవ్ ............ హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు బాస రమేష్ యాదవ్ ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాస రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, తెలంగాణ పునర్నిర్మాణం కోదండరాం గారి నాయకత్వంలోనే సాధ్యమనే నమ్మకంతో టి.జే.ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం తెలంగాణ జన సమితి ప్రధాన లక్ష్యాలని తెలిపారు. ప్రస్తుతం డబ్బు కేంద్రంగా సాగుతున్న రాజకీయాల మధ్య ప్రజల ఆకాంక్షలనే అజెండాగా చేసుకుని టి.జే.ఎస్ పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జన...

శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రొఫెసర్ కోదండరాం

Image
హైదరాబాద్: శాసన మండలి సభ్యునిగా ప్రొఫెసర్ కోదండరాం గారు ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కోదండరాం గారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్ గారు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, మంత్రులు శ్రీధర్ బాబు గారు, వివేక్ గారు, ఎంపీ వేమ నరేందర్ రెడ్డి గారు, ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, టి.జే.ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. శాసన మండలి మీడియా పాయింట్ లో ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ పదవులు అనేవి శాశ్వతం కావని అన్నారు. “ఒకాయన నేను పోరాడుతానా లేదా అని అన్నారు, నేను పోరాడి చూపిస్తా” అని స్పష్టం చేశారు. అనేక కేసులు, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ తన పని ఆగలేదని, ముందుకే సాగుతుందని తెలిపారు. వివాదాస్పద సమస్యలకు పరిష్కారం లభించేలా కృషి చేస్తానని, స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకొని పని చేస్తానని పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉద్యమకారుల సమస్యలు, ఆదివాసుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ఇప్పటి వరకు చేస్తున్న ప్రజా సేవను...