Posts

Showing posts with the label Telangana Development

ప్రజల ముంగిట్లోకి అభివృద్ధి ఫలాలు - షబ్బీర్ అలీ వెల్లడి

Image
కామారెడ్డి , ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కింద 99 రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల జిల్లా అధికారులు, నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రభుత్వ 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను తీసుకువచ్చిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు చేరాలంటే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద...