Posts

Showing posts with the label Telangana Taekwondo

Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

నిజామాబాద్ జిల్లా టైక్వాండో క్రీడ పోటీలు అభినందనీయం - క్రీడారంగంలో రాణించి జిల్లాకు వన్య తీసుకురావాలి.

Image
నిజామాబాద్ జిల్లాలో ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా టైక్వాండో క్రీడ పోటీలో పాల్గొంటున్న విద్యార్థులు క్రీడాకారులు తమ నైపుణ్యం ప్రదర్శించి జిల్లాకు వన్నె తీసుకురావాలని నిజామాబాద్ నగర మేయర్ కూరగాయల. ఉమాదేవి అన్నారు. ఈరోజు నగరంలోని టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టైక్వాండో అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ పవర్, టైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీర్ వహజ్ అలీ ఖాన్, రాష్ట్ర అబ్జర్వర్ ముస్తఫా, లు హాజరైనారు. జిల్లా స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని నగర మేయర్ ఉమారాణి రమేష్ అన్నారు. నగరంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ తైక్వాండో జిల్లా ఛాంపియన్షిప్ పోటీలను ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ చైర్మన్ రమేష్ పవర్ పాల్గొన్నారు. మేయర్ మాట్లాడుతూ కరాటే, తైక్వాండో వంటి క్రీడలు ఆత్మరక్షణకు ఎంతో ఉపయోగపడతాయని, విద్యార్థి దశ నుంచే శిక్షణ తీసుకుంటే శారీరక దృఢత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలిపారు. ఇలాంటి టోర్నమెంట్లను సద్వినియోగం చేసుకుంటే క్రీడాకారులు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థా...