Posts

Showing posts with the label Telangana Updates

విద్య, వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి...

Image
విద్య వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టాలని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తాము ఇచ్చిన పాంచజన్యంలో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేయకుంటే గన్ పార్క్ లోని అమరుల స్థూపం స్తంభానికి కట్టేసి కొట్టాలని సూచించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొని జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు చెప్పారు. తన తండ్రి కేసీఆర్ తో తనకు పంచాయితీ లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడిగానే ఆయననను విమర్శించానని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చిన సరే తెలంగాణ ప్రజల కోసం తాను ముందుకే వెళ్తానన్నారు. తన టార్గెట్ సర్వోదయ తెలంగాణ సాధించటమేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఎవరైతే విలనో...తనకు కూడా వాళ్లే విలన్ అని చెప్పారు. కేసీఆర్ ను రాజకీయ నేతగానే విమర్శించానని తండ్రిగా ఆయనతో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. రాళ్లతో కొట్టండి:- తెలంగాణ రక్షణ సేన ప్రకటించిన పాంచజన్యం లోని ఐదు అంశాలు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో తాను ఇచ్చిన మాట తప్పితే అమరవీరుల స్తూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టాలని కల్వకుంట్ల కవిత తెలిపారు. అ...

నిజామాబాద్ ప్రజలకు అలర్ట్: మొబైల్‌లో సైరన్ శబ్దం వస్తే భయపడొద్దు!

Image
నిజామాబాద్ జిల్లా ప్రజలకు గమనిక: మీ మొబైల్ ఫోన్ హఠాత్తుగా గట్టిగా సైరన్ శబ్దం చేస్తూ, వైబ్రేట్ అవుతుంటే ఆందోళన చెందకండి. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న అత్యవసర హెచ్చరిక వ్యవస్థ (Emergency Alert System) పరీక్షలో భాగం., కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు టెలికమ్యూనికేషన్ విభాగం సంయుక్తంగా ఈ మే 2న (శనివారం) దేశవ్యాప్తంగా ఈ అత్యాధునిక వ్యవస్థను అధికారికంగా ప్రారంభించనున్నాయి. దీనికి సంబంధించి ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహిస్తున్నారు. మీ ఫోన్లలో ఏం జరుగుతుంది? నిజామాబాద్‌లోని మొబైల్ వినియోగదారులకు ఈ రోజు ఒకటి కంటే ఎక్కువసార్లు అలర్ట్‌లు రావచ్చు: శబ్దం మరియు వైబ్రేషన్: మీ ఫోన్ సైలెంట్ లేదా "డూ నాట్ డిస్టర్బ్" మోడ్‌లో ఉన్నప్పటికీ, ఈ ప్రత్యేక హెచ్చరిక వచ్చినప్పుడు గట్టిగా శబ్దం వస్తుంది. సందేశం: స్క్రీన్‌పై తెలుగు, హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో ఒక పాప్-అప్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. అందులో “ఇది ఒక నమూనా పరీక్ష సందేశం (SAMPLE TESTING MESSAGE)” అని స్పష్టంగా రాసి ఉంటుంది. మనం ఏం చేయాలి?: ఈ సందేశాన్ని చూసిన తర్వాత కేవలం 'OK' బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుం...

పెర్కిట్ మహిళా ప్రాంగణం ఘటనపై కలెక్టర్ సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం

Image
పెర్కిట్, మహిళా ప్రాంగణంలో ఇటీవల చోటుచేసుకున్న సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. మహిళా ప్రాంగణం జిల్లా మేనేజర్ పి.ఇందిర శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ను కలిసి జరిగిన సంఘటన గురించి తెలియజేశారు. గత మార్చి నెల 02 వ తేదీ నుండి 31వ తేదీ వరకు బ్యూటిషియన్ కోర్సులో బాలికలు, యువతులకు మహిళా ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ కోర్సులో శిక్షణ అందించిన తాత్కాలిక ఇన్ స్ట్రక్టర్ గా కొనసాగిన స్నేహ, బాలికలు, యువతుల ఫోటోలు, ఫోన్ నెంబర్లను సతీష్ అనే వ్యక్తికి పంపించిందని అన్నారు. దీంతో సతీష్ కొంతమంది యువతులకు ఫోన్ లు చేసి, వాట్సప్ చాటింగ్ ల ద్వారా వేధింపులకు గురి చేశాడని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. బాధిత యువతులు ఈ విషయాన్ని గురువారం రోజున తమ దృష్టికి తేగా, పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయించామని తెలిపారు. ఈ ఉదంతంపై కలెక్టర్ తీవ్రంగా స్పందించారు. ఈ తరహా చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, బాధ్యులైన వారిపై జిల్లా యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. పెర్కిట్ మహి...