Posts

Showing posts with the label Telangana events

నిజామాబాద్‌లో ఘనంగా బాబూ జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలు

Image
నిజామాబాద్, భారత మాజీ ఉపప్రదాని డాక్టర్ బాబు జగ్జీవన్ రాం 119వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్ కమాన్ వద్ద గల పాత అంబేడ్కర్ భవన్ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర మేయర్ కే.ఉమారాణి, రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు బాబూ జగ్జీవన్ రాం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాత అంబేడ్కర్ భవన్ ఆవరణలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని బాబు జగ్జీవన్ రాం చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, బాబూ జగ్జీవన్ రాం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రాం అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. మహనీయుల గొప్...

వీర హనుమాన్ విజయాత్ర రూట్ మ్యాప్ పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

Image
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 2వ తేదీన జరిగే వీర హనుమాన్ విజయ యాత్ర రూట్ మ్యాప్ ను మంగళవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ పరిశీలించారు. స్థానిక కోడూరు హనుమాన్ ఆలయం నుండి విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ సభ్యులతో కలిసి పెద్ద బజార్,నిజాంసాగర్ చౌరస్తా, జీవధాన్ రోడ్డు, జన్మభూమి రోడ్డు, కొత్త బస్టాండ్, పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషన్, ధర్మశాల, సుభాష్ రోడ్డు, పాంచ్రస్తా హరిజనవాడ, రూట్ లో సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఏఎస్పీ, సిఐ, విద్యుత్తు, మున్సిపల్, ఆర్ అండ్ బి తదితర అధికారులు విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుపబడే వీర హనుమాన్ విజయాత్ర ఆహ్వాన పత్రికను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి కి, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర,ఎఎస్పీ చైతన్య రెడ్డి లకు అందచేశారు. విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు ఆధార నిత్యానందం,కార్యదర్శి బొల్లి రాజు, ప్రచార ప్రముఖ్ శ్రీకాంత్ రావు, బజరంగ్ దళ్ జిల్లా సంయోజక్ వివేకానంద అశోక్, ఏకేష్, కార్యకర్తలు పాల్గొన్నారు. ...

గోదావరి పుష్కరాల ఏర్పాట్లు వేగవంతం.. కందకుర్తి ఘాట్‌ను కలెక్టర్ పరిశీలన

Image
నిజామాబాద్, వచ్చే ఏడాది జూలైలో అట్టహాసంగా జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఏర్పాట్లను వేగవంతం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. రెంజల్ మండలంలోని కందకుర్తి పుష్కర ఘాట్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. పక్షం రోజుల క్రితం కూడా ఈ పుష్కర ఘాట్ ను సందర్శించిన సమయంలో అధికారులకు పురమాయించిన పనులను వారు ఏమేరకు చేపట్టారు అని క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. పుష్కర ఘాట్ కు వచ్చే మార్గాలలో రహదారుల మరమ్మతులు, విస్తరణ పనులను, శివాలయం వద్ద కొనసాగుతున్న పనులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్దంగా పనులు చేపట్టాలని అన్నారు. పుష్కరాల సమయంలోనే కాకుండా ఈ ప్రదేశానికి సాధారణ సమయాలలోనూ భక్తులు తరలివస్తారని, వారి సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు భక్తులకు కనీస వసతులు అందుబాటులో ఉండేలా చొరవ చూపాలన్నారు. గోదావరి పుష్కరాలకు త్రివేణి సంగమ ప్రాంతం అయినందున ఈ ఘాట్ వద్ద పుణ్య స్నానాల కోసం ప్రముఖులతో పాటు, లక్షలాదిగా భక్తులు పుణ్య స్నానాలకు తరలివచ్చే అవకాశాలు ఉన్నందు...

హనుమాన్ ర్యాలీకి లక్షకు పైగా భక్తులు.. VHP భారీ ఏర్పాట్లు

Image
📍 నిజామాబాద్, ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ ధరణి ర్యాలీని విజయవంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, ఈసారి లక్షకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. 👉 ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం కూడా లక్షకు పైగా భక్తులు పాల్గొన్నారని, ఈసారి మరింత భారీగా స్పందన ఉండే అవకాశం ఉందన్నారు. 💬 ఈ ర్యాలీ విజయవంతం కావడానికి ప్రజలతో పాటు పోలీసు శాఖ, మున్సిపల్ అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 👉 నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ హిందూ విభాగం కార్యదర్శి కృష్ణాజీ దినేష్ ఠాగూర్, విహెచ్పి జిల్లా అధ్యక్షులు, హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు దాసరి సాయి ప్రసాద్, దాత్రిక రమేష్, శేఖర్, నికేష్ తదితరులు పాల్గొన్నారు. 👉 మీరు ఈ ర్యాలీలో పాల్గొంటారా? కామెంట్ చేయండి 💬 👉 మరిన్ని తాజా వార్తల కోసం Mana Nizamabad ను ఫాలో అవ్వండి 🔔 Follo...