Posts

Showing posts with the label crime news

64 ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసిన అంతర్జిల్లా దొంగల ముఠా అరెస్ట్.. 80 కిలోల కాపర్ కాయిల్స్ స్వాధీనం

Image
జిల్లాల్లో విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేస్తూ, వాటిలోని రాగి (కాపర్) కాయిల్స్ ను అపహరిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్జిల్లా దొంగల మురాను రెంజల్ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. లక్షల విలువైన 80 కిలోల కాపర్ కాయిల్స్, దొంగతనాలకు ఉపయోగించిన 3 మోటార్ సైకిళ్లు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న నలుగురు స్క్రాప్ (పాత ఇనుప సామాను) వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మేరకు శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సాయి చైతన్య వివరాలు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. గురువారం (మే 21) సాయంత్రం 5 గంటల ప్రాంతంలో రెంజల్ సట్- ఇన్స్పెక్టర్ తన సిబ్బందితో కలిసి సాటాపూర్ బైపాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో మూడు మోటార్ సైకిళ్లపై అనుమానాస్పదంగా వస్తున్న ఐదుగురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న గన్నీ బ్యాగును తనిఖీ చేయగా, అందులో భారీ మొత్తంలో ట్రాన్స్ ఫార్మర్ కాపర్ కాయిల్స్ లభ్యమయ్యాయి. ప...

నిజామాబాద్‌లో హనీ ట్రాప్ గుట్టురట్టు.. కిలాడి దంపతుల అరెస్టు

Image
హనీ ట్రాప్ సంఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది.పురుషుల బలహీనతను అలుసుగా చేసుకుని వలపు వల విసిరి హనీట్రాప్ కు పాల్పడుతున్న మహిళను పోలీసులు వల పట్టుకున్నారు. ఒంటరిగా ఉన్న మగ వారిని ముగ్గులోకి దించుతూ.. డబ్బులు ఇవ్వ కుంటే కేసులో ఇరికిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్న భార్యభర్తలను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ రూరల్ పీఎస్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముథ్కేడ్ తాలూ కా ముక్రంబాద్ గ్రామానికి చెందిన మంగేశ్ గైక్వాడ్, ఉజ్వల గైక్వాడ్ దంపతులు. వీరు రెండు నెలల క్రితం మాధవనగర్ గ్రామంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నారు. ఉజ్వల గైక్వాడ్ కంఠేశ్వర్ బైపాస్, ఆర్మూర్ రోడ్డు ప్రాంతంలో రోడ్డు పక్కన నిల బడి ఒంటరిగా వెళ్తున్న మగవారికి సైగలు చేసే ది. ఆమెను చూసి ఆమె దగ్గరకు వచ్చిన మగ వారిని తాను వ్యభిచారం చేస్తానని డబ్బులు ఒంటరిగా ఉన్న మగవారిని ముగ్గులోకి దించుతూ అక్రమ వసూళ్లు చేసి మాట్లాడుకొని అతని బైక్ పై కూర్చుని నిర్మా నుష్య ప్రదేశానికి తీసుకువెళ్లేది. అప్పటికే వీరు వెళ్తున్న బైక్ను వెనకాల నుంచి ఆమె భర్త మంగేశ్ గైక్వాడ్ ఫాలో చేసేవాడు. ...

నిజామాబాద్‌లో అక్రమంగా గోవుల తరలింపు అడ్డుకున్న స్థానికులు

Image
అక్రమంగా మినీ టాక్సీలో గోవులను పెట్టుకొని ఆర్మూర్ రోడ్డు నుండి నిజామాబాద్ నగరంలోకి వెళ్తున్న ఆ వాహనాన్ని నిజామాబాద్ నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీరామ గార్డెన్ సమీపంలో స్థానికులు అక్రమంగా తరలిస్తున్న గోమాతల వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో స్థానికులు వెంటనే రూరల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ తన బృందంతో ఘటన స్థలానికి చేరుకుని ఆ వాహనం ఎక్కడినుండి వచ్చింది, ఎక్కడకు వెళ్తుంది అనే వివరాలు, అసలు ఈ గోవులను అక్రమంగా తరలిస్తున్న వారెవరు అనే వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సిఐ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆ తర్వాత గోవులను మల్లారం గోశాలకు తరలించినట్లు రూరల్ సీఐ ఫోన్ ద్వారా సమాచారం మన నిజామాబాద్ ఛానల్ కు అందించారు. అయితే గో అక్రమ లో ప్రధాన పాత్ర వహించిన నిందితులను తమ దర్యాప్తులో తేలిన తర్వాత కేసు నమోదు చేస్తామని ఆయన పేర్కొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp ...