Posts

Showing posts with the label madhavanagaram

సౌమ్య కేసులో సంచలన ట్విస్ట్..! గంజాయి స్మగ్లర్లను తప్పించారనే ఆరోపణలు.. లీకైన వీడియోలో కొత్త విషయాలు

Image
( జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు) ... గంజాయి స్మగ్లింగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకునే ప్రయత్నంలో ఆబ్కారీ కానిస్టేబుల్ సౌమ్య మృతి చెందిన సంఘటనకు సంబంధించిన సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చే వీడియో మన నిజామాబాద్ చేతికి చిక్కింది.. జనవరిలో నిజామాబాద్ సమీపంలోని మాధవనగరం ప్రధాన రహదారి మీద గంజాయి స్మగ్లర్ లను పట్టుకునే ప్రయత్నంలో సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే.. స్పాట్లో స్మగ్లర్లు ఉపయోగించిన కారు గుద్దిన సంఘటనలో ఆమె మృతి చెందింది.. ఆరు నెలల కిందట జరిగిన ఈ సంఘటనలో అసలు దోషులను తప్పించారనే ఆరోపణలు ఉన్నాయి.. నిర్మల్,నిజామాబాద్ కు చెందిన గంజాయి స్మగ్లర్లు ఆ రోజు స్పాట్ లో ఉన్నా.. కొందరిని ఆబ్కారీ అధికారులు తప్పించారని ఇద్దరు నిందితులు ఆక్రోశం వెళ్లగక్కిన వీడియో సౌమ్య కేసు వెనుక దాగివున్న డొల్లతనాన్ని బహిర్గతం చేసింది. ఆబ్కారీ SHO స్వప్న ఆఫీసు బ్యారక్ లో నిందితులు అధికారులతో వాదనకు దిగిన సందర్భంగా లేవనెత్తిన ప్రశ్నలు నిజామాబాద్ నిందితులను సౌమ్య కేసునుంచి తప్పించిన తీరును తేటతెల్లం చేస్తోంది.. నిందితుల్లో ఒకరు గాజు సీసాను పగులగొట్టి కొడుపును చీల్చుకునే ప్రయత్నం వల్ల నిందితు...