నిజామాబాద్లో బలవంతపు పన్ను వసూళ్లు? ఇంట్లో ఫ్రిజ్ జప్తు !
నిజామాబాద్ ప్రజలు ఇంకా నిజాం నవాబు పాలనలో ఉన్నామా అంటూ ముక్కున వేలు వేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.. నిజాం నిరంకుశ పాలనలో పన్నుల వసూలు కర్కశంగా ఉండేది.. రజాకార్లను రంగంలోకి దింపి పన్నులు కట్టమని.. ఇంట్లో కనపడిన వస్తువులను ఎత్తుకుని పోయేవారు.. తెలంగాణ రాష్ట్రం సిద్దించక ముందు TDP, కాంగ్రెస్ హయాంలోనూ నిజాం కాలంనాటి జప్తులు కొనసాగేవి..పన్నులు కట్టడం లేదంటూ ఇరుగుపొరుగు వారిని పిలిచి ఇజ్జత్ తీసి ఇంటి దర్వాజలు,కిటికీలు పీక్కపోయి పరువు తీసేవారు అంజువాన్ అధికారులు..అంటే సహకార శాఖ వసూల్ సిబ్బంది.. 13 ఏళ్లలో ఇలాంటి బూజు పట్టిన నవాబు కాలంనాటి బలవంతపు పన్నుల వసూళ్ళు జరుగలేవు.. ఘనత వహించిన నిజామాబాద్ బల్దియా మాత్రం నిజాం తరహా పన్ను వసూళ్లకు బరితెగించారు. శ్రీరామ నవమి పండుగరోజే మిడుతలు దండు వలే నిజామాబాద్ నగరం ఎల్లమ్మ గుట్ట ప్రాంతంలోని విజయ్ టాకీస్ వెనకాల అనౌన్స్ మెంట్ వెహికిల్స్ తో ఎంటరయ్యారు.. నవీన్ అనే మధ్య తరగతి ఇంట్లోకి దూరి ఇంట్లోని వస్తువులను జప్తు చేసేందుకు హడావిడి చేశారు మున్సిపల్ కార్పోరేషన్ ఉద్యోగులు..18000 ఇంటి పన్ను ఇప్పటికిప్పుడు కట్టితీర వల్సిందే అంటూ హుకుం జారీచేశారు....