మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్
( జమాల్పూర్ గణేష్, మూల్పూరు రాజేంద్ర బాబు ) మాదిగల ABCD వర్గీకరణ ఉద్యమ ఫలాలను సాధించి పెట్టిన MRPS అధినేత మంద కృష్ణ మాదిగను టార్గెట్ చేశారు CM రేవంత్ రెడ్డి. గల్లి నుండి ఢిల్లీ దాకా గిన్నిస్ రికార్డులో నమోదు కాగలిగిన ఉద్యమాలను నిర్మించి, మాదిగల ఆరాధ్యదైవంగా స్థిరపడిన మంద కృష్ణ మాదిగ ప్రతిష్టను మసక పారించే సరికొత్త కుట్రకు ముఖ్యమంత్రి కార్యాలయం అడ్డాగా మారింది. స్వయంగా CM కనుసన్నల్లోనే MRPS ను బలహీన పరచి..ప్రత్యామ్నాయ మాదిగ పోరాటాల కోసమని మంద కృష్ణ మాదిగకు కౌంటర్ ఉద్యమాలను నిర్మించ బోతోంది రేవంత్ రెడ్డి టీమ్. మాదిగ ఉద్యోగుల సమన్వయ కమిటీ పేరిట సీఎం రేవంత్ రెడ్డికి సన్మానం చేసిన కార్యక్రమానికి ముందునుంచే ఈ టీమ్ రంగంలో దిగింది. మంత్రులు దామోదర రాజనర్సింహ, అడ్లూరు లక్ష్మన్,కడియం శ్రీహరి పర్యవేక్షణలో సీఎం ఆఫీసు ఆదేశాల మేరకు జిల్లాల వారిగా కార్యాచరణకు దిగింది ఆ టీమ్. న్యూట్రల్ వ్యక్తిగా, లెఫ్ట్ భావజాలం ఉన్న మేధావిగా గుర్తింపు కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఖాసీం ను ముందుంచి పని కానిస్తుంది చీఫ్ మినిష్టర్ ఆఫీసు. సీఎం అభినందన సభకు వచ్చిన మాదిగ ఉద్యోగులలతో పాటు ఆయా రంగాలకు చెంద...