Posts

Showing posts with the label Amit Shah

బీజేపీ వ్యతిరేక నినాదాల కేసు కొట్టివేత.. బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Image
ముంబైలో ఒక సామాన్యుడు బీజేపీ డౌన్ డౌన్ అమిత్ షా డౌన్ డౌన్ అన్నందుకు నమోదైన కేసును కొట్టివేస్తూ బాంబే హైకోర్టు జస్టిస్ మాధవ్ జామ్దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నినాదాలు చేసినందుకు ఒక వ్యక్తిపై పోలీసులు బహిష్కరణ ఉత్తర్వులు జారీ చేయడాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. బీజేపీ ప్రభుత్వం, అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేసినందుకు ఒక సామాన్యుడిపై అక్రమ కేసులు నమోదు చేయడం, అతడిని బహిష్కరించడం వంటి చర్యలను కోర్టు రద్దు చేసింది. విచారణ సందర్భంగా జస్టిస్ మాధవ్ జామ్దార్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీకేజీలు, విద్యార్థుల ఆత్మహత్యలు, జరుగుతుంటే పౌరులపై వరుస కేసులు పెట్టి అణచివేయడం పద్ధతి కాదని ఆయన మండిపడ్డారు. నిరసనను అణచివేయడం అధికార సాధన కాదని, ప్రజలు ప్రశ్నలు అడగడం నేరం కాదని, అది పౌరుడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. " పౌరులందరినీ మీరు ప్రభుత్వానికి బానిసలుగా మారుస్తున్నారా? నినాదం చేస్తే కేసులు పెడతారా?" అంటూ ఆయన పోలీసులను నిలదీశారు. కళ్ల ముందే విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోని అధికార యంత్రాంగం, రాజకీయ నినాదాల మీదనే కక్...

🟠 నిజామాబాద్ నేలపై RSS బీజం

Image
డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్డేవార్ వందేళ్ల క్రితం కేవలం ఐదుగురు సభ్యులతో ప్రారంభించిన ఆర్ఎస్ఎస్ శాఖ విశ్వవ్యాప్తమైంది. ఈ మహా యజ్ఞానికి బీజం పడింది నిజామాబాద్ జిల్లాలో కావడం విశేషం. ఐదుగురితో ఏర్పడ్డ RSS అంచెలంచెలుగా దేశవ్యాప్తం లక్షల స్వయం సేవకులను తయారు చేసింది. ప్రపంచంలోని ముఖ్య దేశాలలో సైతం RSS భావజాలం విస్తరించింది. RSS సిద్ధాంతం నచ్చి.. ఆ భావజాలం నీడలో హెగ్డేవార్ హిందుత్వ ఎజెండా ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. బలమైన రాజకీయ శక్తిగా ఇండియాలో చోదక శక్తిగా ఎదిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇందూరు గడ్డ మీద పురుడు పోసుకుంది. రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో RSS పుట్టింది. RSS వ్యవస్థాపకులు హెగ్డేవార్ తాతయ్య నరసింహ శాస్త్రి. వారి వంశం రేవతి బాయి, బలిరం అనే దంపతులకు జన్మించిన మహానుభావుడు , గొప్ప వ్యక్తి హెడ్గేవర్ .ఆయన జన్మించింది మామూలు రోజు కాదు ..ఆయన పుట్టింది పెరిగింది హిందువుల తెలుగు నూతన సంవత్సర పండగ ఉగాది రోజున..హెగ్డేవార్ 1889 లో జన్మించినట్లు ఆర్ఎస్ఎస్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కందకుర్తి గ్రామంలో 30 కోట్ల రూపాయలతో మూడు అంతస్తులతో కూడిన ఎడ్గేవర్ స్మృతి భవనాన్ని నిర్మిస్తున్నారు అ...