Posts

Showing posts with the label Hyderabad News

తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో న్యాయవాదులు..

Image
హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన "DUCIMUS - WE LEAD" ముగింపు కార్యక్రమంలో అసెంబ్లీలో BRS పక్ష ఉప నేత హరీష్ రావు పాల్గొన్నారు.గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన చేసిన ప్రసంగం విద్యార్థులను అర్రుత లూగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రసంగం ఆయన మాటల్లోనే... "ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తుంటే ఎన్నో పాత జ్ఞాపకాలు, ఉద్వేగభరిత సంఘటనలు గుర్తొస్తున్నాయి . లా పూర్తి చేసుకొని నల్ల సూట్ వేసుకొని బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పరిరక్షకులుగా మారబోతున్న మీ అందరికి అభినందనలు. యువత అంటే సాఫ్ట్వేర్, డాక్టర్ వైపే మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో మీరు లా చదవడం అంటే మీరు something special. ఈ దేశంలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులే అగ్రభాగంలో ఉన్నారు. మహాత్మ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అంబేద్కర్ ఇలా స్వాతంత్ర్య పోరాటంలో ముందున్నది న్యాయవాదులే. సాగర హారం, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమానికి అండగా నిలబడ్డది న్యాయవాదులే. ఎక్కడై...

బీసీ డిక్లరేషన్ అమలు కోసం BRS ఎమ్మెల్యేల నిరసన.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

Image
📍 హైదరాబాద్: బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కామారెడ్డి డిక్లరేషన్, ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. 👉 కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఎమ్మెల్యేలు ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీని తక్షణమే అమలు చేయాలని కోరారు. 💬 రాష్ట్రంలోని బీసీ కార్పొరేషన్లకు వెంటనే నిధులు విడుదల చేసి ఆదుకోవాలని సూచించారు. గొల్ల, కురుమల జీవనోపాధిని దెబ్బతీయొద్దని, రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం బీసీ సబ్ ప్లాన్‌ను అమలు చేయాలని, ముదిరాజ్, గంగపుత్రులను ఆదుకోవాలని కోరారు. 🎣 మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఎమ్మెల్యేలు తెలిపారు. 👉 ఓట్ల కోసం బీసీలను వాడుకుని వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. Follow ...

జర్నలిస్టుల ర్యాలీ, ధర్నాతో దద్దరిల్లిన సమాచార భవన్

Image
హైదరాబాద్, జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబభిస్తున్న నిర్లక్ష్యవైఖరి, వివక్ష ధోరణికి నిరసనగా అనేక మంది జర్నలిస్టులు బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ(ఐఅఃడ్ పీఆర్) కమీషనర్ కార్యాలయం(సమాచార భవన్) ముట్టడించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఇచ్చిన రాష్ట్రవ్యాప్త జర్నలిస్టుల"ఛలో హైదరాబాద్"కార్యక్రమం పిలుపు మేరకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన జర్నలిస్టులు ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐఅండ్ పీఆర్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన జరిపారు. అనంతరం జర్నలిస్టులు ప్రధాన ప్రవేశ ద్వారం ముందు బైఠాయించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ వివక్షకు వ్యతిరేకంగా జర్నలిస్టులు చేసిన నినాదాలతో సమాచార భవన్ దద్దరిల్లింది. ఈ సందర్బంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా జర్నలిస్టుల పట్ల వివక్ష చూపుతుందని, జర్నలిస్టుల సమస్యలను విస్మరించిందని విమర్శించారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ల...