Posts

Showing posts with the label Kamareddy Latest News

పోలీసు దాడిలో ఆశ వర్కర్లకు గాయాలు

Image
*సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన ఆశా వర్కర్ల కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం *భారీ కేట్లను పక్కకు జరిపి గేటు వద్ద ఆందోళన నిర్వహించిన ఆశ వర్కర్లు, CITU నాయకులు *పోలీసుల దాడిలో గాయపడ్డ ఆశా వర్కర్లు *మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ నరేష్ పై నిర్భయ కేసు నమోదు చేయాలని సస్పెండ్ చేసే అరెస్టు చేయాలని డిమాండ్ ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో ఆశ వర్కర్లు సిఐటియు నాయకులు భారీ కేట్లను తోసేసి కలెక్టరేట్ గేటు ముందుకు చేరుకొని పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి పలువురు ఆశా వర్కర్లకు గాయాలయ్యాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే చంద్రశేఖర్, ముదం అరుణ్ లు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని శాంతియుతంగా నిరసన తెలుపుదామని వెళితే పోలీసుల అత్యుత్సాహం వల్ల ఉద్రిక్తత కి దారితీసిందన్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ సీఐ నరేష్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించాడని ఇష్...

ప్రజల ముంగిట్లోకి అభివృద్ధి ఫలాలు - షబ్బీర్ అలీ వెల్లడి

Image
కామారెడ్డి , ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కింద 99 రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల జిల్లా అధికారులు, నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రభుత్వ 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను తీసుకువచ్చిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు చేరాలంటే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద...