మాక్లూర్ IKP కేంద్రంలో రైతుల అవస్థలు.. 20 రోజులైనా వడ్లు కొనని అధికారులు
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస అంతా ఇంతా కాదు.. పండిన ప్రతీ గింజను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటల డొల్లతనం బయట పడింది..20 రోజులుగా వడ్లు తెచ్చిన రైతులు IKP కొనుగోలు కేంద్రంలో నిరీక్షిస్తున్నా కొనే దిక్కు లేకుండా పోయింది. ఈ దుస్థిపై మన నిజామాబాద్ ప్రతినిధి ప్రీతం రెడ్డి నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ లో కండ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి.. వివరాల్లోకి వెళితే... మాక్లూర్ ప్రాథమిక సహకార కేంద్రం ఇష్టారాజ్యంగా తయారయింది. వడ్ల కొనుగోలు సీజన్ కావడంతో రైతుల నుండి వడ్లను కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లకు తరలించాల్సిన అధికారులు బాధ్యత మరిచి సంబంధిత మాక్లూర్ సొసైటీ కార్యదర్శి కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం తో రైతులు తమ పండించిన ధాన్యాన్ని ఎవరికి విక్రయించాలో తెలియని అయోమయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. గంగారాం అనే రైతుతో పాటు 20 మంది తెచ్చిన వడ్లను కొనకుండా IKP సిబ్బంది సతాయిస్తున్నారు. ఇక చైర్మన్ సంగతి సరే ఆయన ఎప్పుడు వస్తాడు ..ఎప్పుడు వెళ్తాడో స్థానిక రైతులకే తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు లబోదిబోమంటున్నారు. తాము వరి కోతలు కోసి 20 రోజులు కావస...