Posts

Showing posts with the label Paddy Procurement

మాక్లూర్ IKP కేంద్రంలో రైతుల అవస్థలు.. 20 రోజులైనా వడ్లు కొనని అధికారులు

Image
వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రైతుల గోస అంతా ఇంతా కాదు.. పండిన ప్రతీ గింజను కొంటున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటల డొల్లతనం బయట పడింది..20 రోజులుగా వడ్లు తెచ్చిన రైతులు IKP కొనుగోలు కేంద్రంలో నిరీక్షిస్తున్నా కొనే దిక్కు లేకుండా పోయింది. ఈ దుస్థిపై మన నిజామాబాద్ ప్రతినిధి ప్రీతం రెడ్డి నిర్వహించిన గ్రౌండ్ రిపోర్ట్ లో కండ్లు బైర్లు కమ్మే నిజాలు వెలుగు చూశాయి.. వివరాల్లోకి వెళితే... మాక్లూర్ ప్రాథమిక సహకార కేంద్రం ఇష్టారాజ్యంగా తయారయింది. వడ్ల కొనుగోలు సీజన్ కావడంతో రైతుల నుండి వడ్లను కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలు చేసి రైస్ మిల్లకు తరలించాల్సిన అధికారులు బాధ్యత మరిచి సంబంధిత మాక్లూర్ సొసైటీ కార్యదర్శి కార్యాలయంలో అందుబాటులో లేకపోవడం తో రైతులు తమ పండించిన ధాన్యాన్ని ఎవరికి విక్రయించాలో తెలియని అయోమయ పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. గంగారాం అనే రైతుతో పాటు 20 మంది తెచ్చిన వడ్లను కొనకుండా IKP సిబ్బంది సతాయిస్తున్నారు. ఇక చైర్మన్ సంగతి సరే ఆయన ఎప్పుడు వస్తాడు ..ఎప్పుడు వెళ్తాడో స్థానిక రైతులకే తెలియని పరిస్థితి ఏర్పడిందని రైతులు లబోదిబోమంటున్నారు. తాము వరి కోతలు కోసి 20 రోజులు కావస...

నిజామాబాద్‌లో ధాన్యం కొనుగోలు భారీ ప్లాన్ 🌾 9 లక్షల టన్నులు సేకరణ!

Image
నిజామాబాద్, యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే ప్రక్రియ సజావుగా కొనసాగేలా సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులు అంకితభావంతో కృషి చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ఆదేశించారు. రైతులు ఎక్కడ కూడా ఏ దశలోనూ ఇబ్బందులు పడకుండా నిర్దిష్ట ప్రణాళికతో ముందుకెళ్లాలని అన్నారు. రబీ వరి ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయా శాఖల అధికారులతో, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈఓలు, ఐకెపి సీసీలు, మెప్మా ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో వరి కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో యాసంగిలో 4.27 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేశారని అన్నారు. సుమారు 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వస్తాయని అంచనా వేయగా, 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 669 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. రైతులు నాణ్యతా ప్రమాణాలకు లోబడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు త...