Posts

Showing posts with the label Telangana Government

Information Commission, Nizamabad News, Right to Information, RTI Act, RTI Seminar, Telangana Government, సమాచార హక్కు చట్టం

Image
*సమాచార హక్కు చట్టంతో జవాబుదారీతనం* నిజామాబాద్, మే 15 : ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజలకు విశ్వాసాన్ని కల్పిస్తూ, పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడమే సమాచార హక్కు చట్టం ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ డాక్టర్ జి.చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రధాన సమావేశ మందిరంలో శుక్రవారం సమాచార హక్కు చట్టం - 2005 పై పీఐఓలకు, ఏపీఐఓలకు, అన్ని శాఖల అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా, సమాచార కమిషనర్లు పీ.వీ.శ్రీనివాస్ రావు, దేశాల భూపాల్ లు హాజరయ్యారు. జిల్లా పాలనాధికారి ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య దేశంలో సమాచారం అందుబాటులో ఉంటేనే ప్రజలకు ఉపయోగమని, ప్రజలు కోరిన సమాచారాన్ని వారికి తెలియజేసే బాధ్యత అధికారులపై ఉందని అన్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును సమాచార హక్కు చట్టం ద్వారా కల్పించబడిందని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలల...

51 కులాల పేర్ల మార్పుకు రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం.. పర్యాయ పదాల చేర్పు

Image
కుల పేరు మార్పు.... పర్యాయ పదం చేర్పు... కులం.. స్థాయికి మరో రూపం. దేశ రాష్ట్ర స్థాయిలో కొన్ని కులాల పేర్లు వాటి తోకలు ప్రతిష్టాకరంగా ఉంటాయన్న భ్రమలో సమాజం ఉంట్టుంది. దానికి తగ్గట్టే వారికీ హోదా కూడా లభిస్తుంది, కానీ కొన్ని సంచార, అర్ధ సంచార, విముక్త జాతులు కుల పదాలు అభ్యన్తరకరముగా అనిపిస్తాయి. ఈమేరకు ఆయా కుల సంఘాలు తమ పేరును మార్చాలని సంవత్సరాల తరబడి విజ్ఞప్తులు పోరాటాలు చేస్తూనే ఉన్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం BC కమిషన్ ని ఏర్పాటు చేస్తూ నియమావళి రూపొందించి ఆయా కులాల పేర్లు మార్పుల చేర్పుల పై మార్గదర్శకాలను ఖరారు చేసింది. దీంతో కమిషన్ సూక్ష్మ స్థాయిలో పర్యటనలు నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. తుదకు కమిషన్ సిఫారసుల మేరకు 51 కులాల పేర్లు మారుస్తూ పర్యాయ పదాలు చేర్చి మంత్రి మండలి ఆమోదం పొందింది. BC - A లో 49 BC - E లో 2 కులాలకు DNT చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. * BC - A లో నెంబరు 4 గా ఉన్న బుడబుక్కల కులానికి శివ క్షత్రియ పేరును ప్రాయ పదంగా మార్చింది. * BC - A లో నెంబరు 5 క్రింద ఉన్న వన్నారు పదాన్ని తొలగించి దోబీ పేరుగా మార్చింది . దీని కింద చాకలి,...

ప్రజల ముంగిట్లోకి అభివృద్ధి ఫలాలు - షబ్బీర్ అలీ వెల్లడి

Image
కామారెడ్డి , ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంతో పాటు గ్రామాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధి కోసం “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” కింద 99 రోజుల కార్యచరణ ప్రణాళికను అమలు చేస్తోందని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో షబ్బీర్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల జిల్లా అధికారులు, నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు ఈ సందర్భంగా ప్రభుత్వ 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు ఈ 99 రోజుల కార్యాచరణ ప్రణాళికను తీసుకువచ్చిందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు నిజంగా ప్రజలకు చేరాలంటే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద...