Posts

Showing posts with the label Telangana Movement

తెలంగాణపై విద్వేషం చరిత్రను ఏమార్చే కుట్ర

Image
తెలంగాణ ఉనికిపై TDP వ్యాఖ్యలు.. చారిత్రక ఆధారాలతో తెలంగాణ వాదుల కౌంటర్ ఎప్పటిలాగే తెలంగాణ మీద విషం చిమ్మింది తెలుగుదేశం పార్టీ.TDP ఆవిర్భావ పండుగ వేళా ఆంధ్ర రాజధాని మంగళగిరి వేదికగా తెలంగాణను అవమానిస్తూ మాట్లాడారు పొలిట్బ్యూరో సభ్యుడు నర్సింహులు. తెలంగాణ ఉనికిని ప్రశ్నిస్తు డిక్షనరిలో తెలంగాణ లేనే లేదు అని అన్నారు. ఈ మాటలు నిమిషాల్లోనే సోషల్ మీడియాలో రాకెట్ స్పీడ్ లో వైరల్ అయ్యింది.తెలంగాణ వాదులు కౌంటర్లతో విరుచుకుపడ్డారు.. చరిత్రలో తెలంగాణ ఉనికికి సంబంధించిన సమాచారం మన నిజామాబాద్ పాఠకుల కోసం... *తెల్లాపూర్ శాసనం (క్రీ.శ. 1417). తెలంగాణ అనే పదం స్పష్టంగా చెక్కబడింది! *వెలిచర్ల శాసనం (క్రీ.శ. 1510) తెలంగాణ ముఖభూమి అని ప్రస్తావన ఉంది! * తిరుమల శాసనాల్లో శ్రీకృష్ణదేవరాయలు ‘తెలంగాణ దుర్గాలు’ జయించినట్లు రాయబడింది! *అమీర్ ఖుస్రో… క్రీ.శ. 1318లోనే “తిలంగి” అనే పదంతో తెలంగాణ భాషను ప్రస్తావించాడు! *పాల్కురికి సోమనాథుడు తన రచనల్లో తెలంగాణ నేల వైభవాన్ని పలికించాడు! * విద్యానాథుడి “ప్రతాపరుద్ర యశోభూషణం”లో… త్రిలింగ దేశ గౌరవం వెలుగొందింది! * అబుల్ ఫజల్ “అయి...

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం.. నాలుగు కేటగిరీల ప్రతిపాదనలు

Image
నాలుగు కెటగిరీల్లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు.. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేశవరావు నేతృత్వంలో ఉద్యమకారుల గుర్తింపు కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ లో ఆదివారం జరిగింది. సమావేశంలో కమిటీ సభ్యులు ఎమ్మెల్సీలు ఫ్రొ,, కోదండరాం, అద్దంకి దయాకర్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు.. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుకు ప్రభుత్వం నుండి అధికారికంగా కమిటీ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు.. అమరవీరుల జ్యోతి కింద ఉన్న ఆఫీస్ లో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసేలా కమిటీ లో నిర్ణయం తీసుకున్నారు. అమరవీరుల గుర్తింపు కోసం త్వరలో ఆల్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసి వారి దగ్గర ప్రతిపాదనలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించింది.. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ,1969 ఉద్యమకారులు , ఉద్యోగ సంఘాలు, కళాకారుల జెఎసి, సబ్బండ వర్గాల జెఏసీ , కుల సంఘాల ,న్యాయవాదులు జేఏసీ,వివిధ జిల్లాలో ఏర్పడిన ఉద్యమ సంఘాలు వారి నుండి ప్రతిపాదనలు తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఉద్యమకారుల కమిటీ జిల్లా పర్యటనలు చేసి విసృతంగా ప్రజల అభిప...

దద్దమ్మ తేజస్వి కి బుద్ధి లేదు.. -- మాజీ ఎంపీ మధు యాష్కీ

Image
60 ఏళ్ల తెలంగాణ పోరాటం గురించి తెలుసుకో.. తేజస్వి సూర్య..! తెలంగాణ గురించి, తెలంగాణ పోరాటం గురించి అవగాహన లేని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నావ్.. ఒకప్పుడు మీ కర్ణాటక ప్రాంతంని ప్రాంతాలు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగమే..! నిజాం పాలనలో ఉన్నవే.. తెలంగాణ చరిత్ర నీకు తెలవదు, మీ నరేంద్ర మోడీకి తెలవదు..! మీ తాత ముత్తాతల చరిత్ర ఏందో.. తెలుసుకొని మాట్లాడు తేజస్వి సూర్య..! బ్రిటిష్ కాలంలో ఇండియా - పాకిస్తాన్ విభజన ఎప్పుడు జరిగింది.? ఏపీ, తెలంగాణ విభజన ఎందుకు జరిగిందో..? అవగాహన లేకుండా రెండింటిని పోల్చుతూ మాట్లాడడం నీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం. ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే తెలంగాణలోనే కాదు.. నీ కర్ణాటకలోనూ నిన్ను చెప్పులతో కొడతారు..! అవకాశం వచ్చినప్పుడల్లా బిజెపి నేతలు తెలంగాణ పట్ల అక్కస్సును వెళ్లగాక్కుతున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ.. ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న తీరు బిజెపి పాలకులకు కంటగింపుగా కనపడుతుందా...? తెలంగాణ రాష్ట్ర ఎదుగుదల ఓర్వలేక పోతున్నారా..? బిజెపి ఎంపీ అలా అడ్డగోలుగా మాట్లాడుతున్నా తెలంగాణ రాష్ట్రం నుం...

దేవీప్రసాద్ సార్... ఒక చిరునవ్వుల సంతకం! – దేశపతి శ్రీనివాస్ భావోద్వేగ రచన

Image
వాల్మీకి రామాయణంలో రాముణ్ణి 'స్మితపూర్వాభిభాషి' అంటడు. అంటే, మాట్లాడకముందే ఒక చిరునవ్వు విసిరేవాడని అర్థం. దేవీ ప్రసాద్ సార్ ని చూస్తుంటే నాకు సరిగ్గ ఇదే మాట గుర్తొస్తుంది. ఎదుటి మనిషిని నొప్పించకుండ, టైమింగ్ మిస్ కాకుండ మాట్లాడటం... అసలు ఎవరి గురించీ చెడ్డగ అనకపోవడం... ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే వచ్చేటివి కావు, అది ఒక 'నేచర్'. ఆ క్వాలిటీసే ఆయన్ని ఒక స్పెషల్ లీడర్‌గా నిలబెట్టాయి. నేను డిగ్రీ చదివే రోజుల్లో 'మరసం' పనుల మీద సిధారెడ్డి సార్ తోని కలిసి మెదక్ కు పోయినప్పుడు మొట్టమొదటిసారి దేవీప్రసాద్ సార్ 'ఆత్మీయ స్పర్శ'కు గురయ్యాను. అప్పటినుండి ఇప్పటిదాకా ఆ ఆత్మీయ అనుబంధ స్పర్శ అంతే తడిగా అట్లనే ఉంది. ఇగ లక్ష్మక్క గురించి చెప్పాలె... ఇంటికి వచ్చే బుద్ధిజీవులు, కవులు, ఉద్యమకారుల పాలిట ఆమె నిజంగా 'అన్నపూర్ణ'. అక్క చేతి వంట రుచి చూసిన వాళ్లెవరూ మర్చిపోలేరు. దేవీప్రసాద్ సార్ సహచరిగా ఆమె ఎన్నో కష్టనష్టాలను ఓపిగ్గా భరించింది తప్ప, ఎప్పుడూ కొంచెం కూడా యాష్ట పడలేదు. సిధారెడ్డి గారితో ఉన్న ఆత్మీయ స్నేహంతో మెదక్ స్టడీ సర్కిల్, మంజీరా రచయితల సంఘం స్...

పీసీసీ చీఫ్ తో తెలంగాణ ఉద్యమకారుల భేటీ

Image
నిజామాబాద్; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముందువరుసలో ఉన్న ఉద్యమకారుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రతినిధి బృందం కలిసింది. అక్రమ కేసులు, నిర్బంధాలు ఎదుర్కొని తెలంగాణ సాధనలో పనిచేసిన ఉద్యమకారులు నిరాదరణకు గురవుతున్నారని మహేష్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల ప్రణాళికను ఆచరణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సొంతింటి కోసం 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షున్ని కోరారు. ఫించన్లు ఇచ్చి ఆదుకోవాలను కోరారు. మహేష్ కుమార్ గౌడ్ ను కలసిన ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షుడు యెండల ప్రదీప్ తోపాటు పుప్పాల రవి,శ్రీనివాస్ గౌడ్,పులి జైపాల్, మేతిరి రాజశేఖర్,జ్వాల రాణి, బర్రికుంట శ్రీనివాస్,సల్ల ప్రవీణ్ ఉన్నారు.