Posts

Showing posts with the label brs party

కేసీఆర్ కార్యాలయంపై దాడికి మూల్యం తప్పదు

Image
నిజామాబాద్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కేసీఆర్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల భౌతిక దాడిన తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ భారాస లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ సారతి, తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యాలయం అని తెలిసి కుట్రపూరితంగా మూకుమ్మదిగా దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వసం చేయడం క్షమించరాని నేరంగా ఆయన అభివర్ణించారు.భారాస నాయకులపైన కుట్రలు చేస్తూ దాడులు చేయడం కాంగ్రెస్ విషసంస్కృతిలో బాగమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టే శక్తియుక్తులు భారాసకు ఉన్నాయని, భారాస శ్రేణుల బలం ముందు కాంగ్రెస్ పలాయనం కాకతప్పదని ఆయన హెచ్చరించారు. గజ్వేల్ తెలంగాణ రాష్ట్రం కోసం గజ్జెకట్టి కదిలిన చరిత్ర ఉన్నదని మరొకసారి గజ్జెకట్టి కదిలితే కాంగ్రెస్ కాలగర్భంలో కలిసి పోతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడులను , కాంగ్రెస్ ను అంధపాతాలానికి తొక్కివేసె బలం గజ్వేల్ ప్రజల సొంతమని, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతే కొలమాణంగా భారాస కదిలి కాంగ్రెస్ ను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తుందని...

తెలంగాణ ఉద్యమంలో అగ్రభాగంలో న్యాయవాదులు..

Image
హైదరాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ విద్యార్థుల ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన "DUCIMUS - WE LEAD" ముగింపు కార్యక్రమంలో అసెంబ్లీలో BRS పక్ష ఉప నేత హరీష్ రావు పాల్గొన్నారు.గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఆయన చేసిన ప్రసంగం విద్యార్థులను అర్రుత లూగించారు. ఈ సందర్భంగా హరీష్ రావు ప్రసంగం ఆయన మాటల్లోనే... "ఉస్మానియా యూనివర్సిటీలోకి వస్తుంటే ఎన్నో పాత జ్ఞాపకాలు, ఉద్వేగభరిత సంఘటనలు గుర్తొస్తున్నాయి . లా పూర్తి చేసుకొని నల్ల సూట్ వేసుకొని బీఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పరిరక్షకులుగా మారబోతున్న మీ అందరికి అభినందనలు. యువత అంటే సాఫ్ట్వేర్, డాక్టర్ వైపే మక్కువ చూపుతున్న ఈ రోజుల్లో మీరు లా చదవడం అంటే మీరు something special. ఈ దేశంలో జరిగిన అనేక ఉద్యమాల్లో, ఆఖరికి తెలంగాణ ఉద్యమంలో కూడా న్యాయవాదులే అగ్రభాగంలో ఉన్నారు. మహాత్మ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, అంబేద్కర్ ఇలా స్వాతంత్ర్య పోరాటంలో ముందున్నది న్యాయవాదులే. సాగర హారం, మిలియన్ మార్చ్, రహదారుల దిగ్బంధం, ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఉద్యమానికి అండగా నిలబడ్డది న్యాయవాదులే. ఎక్కడై...

హనుమాన్ శోభా యాత్రలో బిగాల గణేష్ సేవ..

Image
📍 నిజామాబాద్, హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా నిజామాబాద్ నగరంలో భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించిన శోభాయాత్రలో నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా హనుమాన్ స్వామి విగ్రహ రథం వద్ద గణేష్ బిగాల పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు పొందారు. నగరం మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోగా, “జై శ్రీరాం”, “జై హనుమాన్” నినాదాలతో ఆధ్యాత్మిక వాతావరణం అలరించింది. అనంతరం నిజామాబాద్ అర్బన్ BRS పార్టీ ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, పండ్లు పంపిణీ చేసి సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులతో ఆప్యాయంగా మమేకమై, వారికి అభివాదం చేస్తూ శోభాయాత్రలో కలిసి నడిచారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ హనుమాన్ స్వామి భక్తి, బలం, ధైర్యానికి ప్రతీక అని, స్వామివారి కృపతో ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ప్రతి ఇంటిలో ఆనందం, ఐశ్వర్యం నిండాలని ప్రార్థించారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel