Posts

Showing posts with the label education news

పకడ్బందీగా తెలంగాణ ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు నిర్వహించాలి

Image
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఏప్రిల్, మీ 2026 విషయాలపై జిల్లా ఉన్నతాధికారులు సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరేట్లో సమన్వయ సమావేశం నిర్వహించారు. డి ఆర్ డి ఏ పి డి సాయ గౌడ్, డిఇఓ అశోక్ జిల్లా వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుండి నిర్వహిస్తున్న ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఎలాంటి మాస్ కాపీయింగ్కు తావులేకుండా చూడాలని ఆదేశించారు. వాటికి అనుగుణంగా తగు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం డిఆర్డిఏ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించే ఓపెన్ పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం

Image
తన గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల BRS అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్య గారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గారు స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి మరణంతో శొకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా.. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా జైశెట్టి రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా వారికి పేరున్నది. "సౌత్ ఇండియా టెంపుల్స్" అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య పీహెచ్‌డీ డాక్టర్ పట్టాను పొందారు. ...