Posts

Showing posts with the label nizamabad latest news

రణరంగంగా మారిన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

Image
కమిషనర్ ఛాంబర్ ఎదుట బైఠాయించిన మున్సిపల్ కార్మికులు పరిస్థితి ఉద్రిక్తం ధర్నా కార్యక్రమంలో అపస్మారక స్థితికి చేరుకున్న మహిళా కార్మికులు మన నిజామాబాద్ అర్బన్.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం మున్సిపల్ కార్మికుల వేతనాలు చెల్లించాలంటూ సిపిఐ సిపిఎం ఎ టి యు సి ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం రణరంగంగా మారింది. మున్సిపల్ కమిషనర్ చాంబర్ ముందు కార్మికులు బైఠాయించి సుమారు అరగంటసేపు నిరసన తెలిపారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి వదిలి వెళ్లాలని కోరారు. దీంతో కార్మికులు అంతా మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం మెట్లపై కూర్చుని సైతం తమ డిమాండ్లు నెరవేరే వరకు ఇక్కడ నుండి వెల్లబోమని బీస్మించుకొని కూర్చుండి పోయారు. అయితే ఇది ఇలా ఉండగా రెండవ అంతస్తులో ఉండే డిప్యూటీ కమిషనర్ను కలిసి తమ సమస్యను విన్నవించడానికి వెళ్లిన మహిళా కార్మికులు డిప్యూటీ కమిషనర్ తలుపు మూసి ఉంచటంతో వాటిని తెరవాలని చేతులతో బాధదంతో ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులకు మహిళా కార్మికులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు మహిళలు అపస్మారక స్థితికి చేరుకొని పడి...

పీసీసీ చీఫ్ తో తెలంగాణ ఉద్యమకారుల భేటీ

Image
నిజామాబాద్; తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ముందువరుసలో ఉన్న ఉద్యమకారుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఉద్యమకారులు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ను తెలంగాణ ఉద్యమకారుల సంఘం ప్రతినిధి బృందం కలిసింది. అక్రమ కేసులు, నిర్బంధాలు ఎదుర్కొని తెలంగాణ సాధనలో పనిచేసిన ఉద్యమకారులు నిరాదరణకు గురవుతున్నారని మహేష్ గౌడ్ దృష్టికి తీసుకువచ్చారు. ఎన్నికల ప్రణాళికను ఆచరణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం సొంతింటి కోసం 250 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షున్ని కోరారు. ఫించన్లు ఇచ్చి ఆదుకోవాలను కోరారు. మహేష్ కుమార్ గౌడ్ ను కలసిన ప్రతినిధి బృందంలో రాష్ట్ర అధ్యక్షుడు యెండల ప్రదీప్ తోపాటు పుప్పాల రవి,శ్రీనివాస్ గౌడ్,పులి జైపాల్, మేతిరి రాజశేఖర్,జ్వాల రాణి, బర్రికుంట శ్రీనివాస్,సల్ల ప్రవీణ్ ఉన్నారు.

మాట ఇచ్చారు.. గూడునిచ్చారు! నాడు పాదయాత్రలో హామీ.. నేడు షబ్బీర్ అలీ గారి సమక్షంలో గృహప్రవేశం. 🏠❤️

మాట ఇచ్చారు.. గూడునిచ్చారు! నాడు పాదయాత్రలో హామీ.. నేడు షబ్బీర్ అలీ గారి సమక్షంలో గృహప్రవేశం. 🏠❤️ ​కళ్లలో కన్నీళ్లు.. కూలిపోతున్న గోడలు.. నాడు చిన్న మల్లారెడ్డిలో బిక్నూర్ లక్ష్మి, రాజమణి గారి దుస్థితిని చూసి చలించిపోయిన రేవంత్ అన్న, "నేనున్నాను" అని భరోసా ఇచ్చారు. అన్న చెప్పినట్టే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది.. పేదోడి ఇంటి కల నిజమైంది. ​నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, నేడు ప్రభుత్వ సలహాదారులు శ్రీ మహమ్మద్ షబ్బీర్ అలీ గారి ఆధ్వర్యంలో వారి కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేయించడం మనందరికీ గర్వకారణం. పేదల ముఖంలో చిరునవ్వు చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం! ✋