Posts

Showing posts with the label nsui

Big Breaking : మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కోర్టులో కేసు

Image
 కామారెడ్డి పట్టణ ప్రథమ పౌరురాలు ఇప్ప ఉమారాణి మున్సిపల్ కౌన్సిలర్ ఎన్నిక చెల్లదంటూ ఆమె రాజకీయ ప్రత్యర్థి రంగ మాధవి కామారెడ్డి జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.   కామారెడ్డి మున్సిపాలిటీలో 38 వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ఇప్ప ఉమారాణి మునిసిపల్ చైర్మన్గా భాద్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఎన్నికల నియమావలికి వ్యతిరేకంగా, నిబంధనలకు విరుద్ధంగా కేవలం మూడు ఓట్ల తేడాతో ఎన్నికయ్యారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా మంగళవారం కామారెడ్డి జిల్లా న్యాయస్థానంలో దాఖలు చేసిన కేసు నంబర్ ELEC. OP 1 OF 2026 ఎలక్షన్ పిటిషన్ కోర్టులో అడ్మిట్ అయింది.  ఈ నేపథ్యంలో ఈ కేసుని జిల్లా న్యాయమూర్తి CHVRR Prasad విచారణకు స్వీకరించారు.

కాంగ్రెస్ లో బడా నేత ప్రతిష్టకు ముడుపుల మరక.

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ బడా నేత నిర్వాకం కాంగ్రెస్ లో కలవరం రేకెత్తిస్తోంది. పార్టీతో ఏమాత్రం సంబంధం లేని కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణిని ప్రతిష్టాత్మక నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోపెట్టడానికి బడా నేత వేసిన స్కెచ్చు బెడిసి కొడుతుందనే భయం పార్టీ శ్రేణుల్లో కనపడుతోంది.. రాజకీయ సంకట స్థితికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు..10కోట్లు నజరానా తీసుకుని నరేందర్ రెడ్డి కి మేయర్ సీటును కట్టబెడుతున్నారని ఎంపీ అర్వింద్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను కడిగి పారేశారు.దీనివల్ల బడా నేతకే కాకుండా పార్టీ ప్రతిష్ట మసక పారడం ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.డబ్బు సంచులు చేతులు మారడం వల్లనే పార్టీకి సంబంధం లేని వ్యాపార దిగ్గజం తెర మీదికి వచ్చిందనే ప్రచారం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో పార్టీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి..అందుకే  బడా నేత నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించనూ లేదు.. వ్యతిరేకుంచనూ లేదు నాయకత్వ గణం.. చివరకు పార్టీ జిల్లా నాయకత్వం కూడా పెదవి విప్పే సాహసం చేయ లేదు..కోట్లు తీసుకుని కాటిపల్లికి భరోసా ఇచ్చారని అర్వింద్ సోషల్...

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

Image
  ✍︎... జమాల్పూర్ గణేష్ :- కాంగ్రెసు పార్టీకి జవసత్వాలు పోస్తున్న క్యాడర్,లీడర్ల మనోభావాలను మందు పాతర పెట్టి ఖతం చేస్తున్న బడా నేత ఎవరనే చర్చ  చక్కర్లు కొడుతోంది.     కాసు బ్రహ్మానంద రెడ్డి జమానాలో అప్పటి ఆర్థిక మంత్రి అర్గుల్ రాజారాం నుంచి మొదలుకుని YS రాజశేఖర్ రెడ్డి హయాంలో డి. శ్రీనివాస్(DS) వరకు కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో పార్టీ సీనియర్లకు రాజకీయ అవకాశాలు దక్కాయి. పార్టీలోనూ..రాజ్యాంగ బద్ధ పదవుల్లోనూ పార్టీకి పునాదిగా పనిచేయడం ద్వారా పైకి వచ్చిన వారికే అవకాశాలు దక్కాయి. ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయింది.పార్టీ కోసం భుజాలు అరిగే దాకా జెండాలు మోసి..రాస్తారోఖో..రైల్ రోఖో.. బంద్ కరో బంద్ కరో అంటూ నోర్లు బొంగురు పోయే దాకా అరిచి నెత్తి నోరు కొట్టుకున్న నిఖార్సయిన ,నిజమైన కాంగ్రెస్ క్యాడర్ కు లాస్ట్ బెంచే దిక్కయ్యింది..   ఖరీదైన ఖద్దరు బట్టలేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో మండవ వెంకటేశ్వర రావుతో రాసుకు పూసుకు తిరిగిండు..BRS ఏలుబడిలో అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి,కల్వకుంట్ల కవితతో చనువుగా ఉంటుండే..ఇప్పుడు PCC చీఫ్ మహేష్ తో పాటు సర్కార్ సలహదారులు సుదర్శన్ రెడ్డ...