కాంగ్రెస్ లో బడా నేత ప్రతిష్టకు ముడుపుల మరక.
- Get link
- X
- Other Apps
జమాల్పూర్ గణేష్....✍︎
బడా నేత నిర్వాకం కాంగ్రెస్ లో కలవరం రేకెత్తిస్తోంది. పార్టీతో ఏమాత్రం సంబంధం లేని కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణిని ప్రతిష్టాత్మక నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోపెట్టడానికి బడా నేత వేసిన స్కెచ్చు బెడిసి కొడుతుందనే భయం పార్టీ శ్రేణుల్లో కనపడుతోంది.. రాజకీయ సంకట స్థితికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు..10కోట్లు నజరానా తీసుకుని నరేందర్ రెడ్డి కి మేయర్ సీటును కట్టబెడుతున్నారని ఎంపీ అర్వింద్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను కడిగి పారేశారు.దీనివల్ల బడా నేతకే కాకుండా పార్టీ ప్రతిష్ట మసక పారడం ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.డబ్బు సంచులు చేతులు మారడం వల్లనే పార్టీకి సంబంధం లేని వ్యాపార దిగ్గజం తెర మీదికి వచ్చిందనే ప్రచారం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో పార్టీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి..అందుకే బడా నేత నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించనూ లేదు.. వ్యతిరేకుంచనూ లేదు నాయకత్వ గణం.. చివరకు పార్టీ జిల్లా నాయకత్వం కూడా పెదవి విప్పే సాహసం చేయ లేదు..కోట్లు తీసుకుని కాటిపల్లికి భరోసా ఇచ్చారని అర్వింద్ సోషల్ మీడియా కోడై కుసినా..దీన్ని జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు కాటిపల్లి నగేష్ తో పాటు ఏ ఒక్క ముఖ్య నేత కూడా అదొక ఉత్త ప్రచారమమని కానీ.. అంతా ట్రాష్ అని గానీ బహిరంగంగా మాట్లాడకుండా తప్పించు కోవడం గమనార్హం.. అందుకే బడా నేతనే పరోక్షంగా తోసిపుచ్చాల్సిన దుస్థితిని ఎదుర్కోక తప్పలేదు.. మేయర్ సీటు కోసం ముల్లెలు మారాయని జరుగుతున్న రాద్ధాంతంపై ముక్కు సూటిగా వ్యవహరించే
సొంత పార్టీ MLA సైతం బడా నేత నిర్వాకం పట్ల గుర్రుగా ఉన్నట్లు ప్రచారంలో ఉంది.. ఇంకా ఒకరిద్దరు సీనియర్లు మేయర్ సీటు కోసం వారసులను ఎన్నికల బరిలో దించారు..ఈ నేపథ్యంలో బడా నేత యూ టర్న్ తీసుకుని ఎన్నికల ఫలితాల తరువాతనే మేయర్ ఎవరనే అంశాన్ని తెలుస్తామని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు.. కానీ ఆరు నూరైనా..నూరు ఆరైనా మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే తన దోస్తుకే పట్టం కట్టడానికే పావులు కదుపుతున్నారు..
- Get link
- X
- Other Apps