Posts

Showing posts with the label political news

దద్దమ్మ తేజస్వి కి బుద్ధి లేదు.. -- మాజీ ఎంపీ మధు యాష్కీ

Image
60 ఏళ్ల తెలంగాణ పోరాటం గురించి తెలుసుకో.. తేజస్వి సూర్య..! తెలంగాణ గురించి, తెలంగాణ పోరాటం గురించి అవగాహన లేని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్నావ్.. ఒకప్పుడు మీ కర్ణాటక ప్రాంతంని ప్రాంతాలు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో భాగమే..! నిజాం పాలనలో ఉన్నవే.. తెలంగాణ చరిత్ర నీకు తెలవదు, మీ నరేంద్ర మోడీకి తెలవదు..! మీ తాత ముత్తాతల చరిత్ర ఏందో.. తెలుసుకొని మాట్లాడు తేజస్వి సూర్య..! బ్రిటిష్ కాలంలో ఇండియా - పాకిస్తాన్ విభజన ఎప్పుడు జరిగింది.? ఏపీ, తెలంగాణ విభజన ఎందుకు జరిగిందో..? అవగాహన లేకుండా రెండింటిని పోల్చుతూ మాట్లాడడం నీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం. ఇలాంటి సిగ్గుమాలిన మాటలు మాట్లాడితే తెలంగాణలోనే కాదు.. నీ కర్ణాటకలోనూ నిన్ను చెప్పులతో కొడతారు..! అవకాశం వచ్చినప్పుడల్లా బిజెపి నేతలు తెలంగాణ పట్ల అక్కస్సును వెళ్లగాక్కుతున్నారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పటికీ.. ఏ చిన్న సంఘటన కూడా జరగకుండా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న తీరు బిజెపి పాలకులకు కంటగింపుగా కనపడుతుందా...? తెలంగాణ రాష్ట్ర ఎదుగుదల ఓర్వలేక పోతున్నారా..? బిజెపి ఎంపీ అలా అడ్డగోలుగా మాట్లాడుతున్నా తెలంగాణ రాష్ట్రం నుం...

కేసీఆర్ కార్యాలయంపై దాడికి మూల్యం తప్పదు

Image
నిజామాబాద్, గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కేసీఆర్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల భౌతిక దాడిన తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్ భారాస లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ దాదన్నగారి మధుసుధన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమ సారతి, తెలంగాణ రాష్ట్ర స్వాప్నికుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కార్యాలయం అని తెలిసి కుట్రపూరితంగా మూకుమ్మదిగా దాడి చేసి ఫర్నిచర్ ను ధ్వసం చేయడం క్షమించరాని నేరంగా ఆయన అభివర్ణించారు.భారాస నాయకులపైన కుట్రలు చేస్తూ దాడులు చేయడం కాంగ్రెస్ విషసంస్కృతిలో బాగమేనని ఆయన అన్నారు. కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టే శక్తియుక్తులు భారాసకు ఉన్నాయని, భారాస శ్రేణుల బలం ముందు కాంగ్రెస్ పలాయనం కాకతప్పదని ఆయన హెచ్చరించారు. గజ్వేల్ తెలంగాణ రాష్ట్రం కోసం గజ్జెకట్టి కదిలిన చరిత్ర ఉన్నదని మరొకసారి గజ్జెకట్టి కదిలితే కాంగ్రెస్ కాలగర్భంలో కలిసి పోతుందని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ దాడులను , కాంగ్రెస్ ను అంధపాతాలానికి తొక్కివేసె బలం గజ్వేల్ ప్రజల సొంతమని, ప్రజాస్వామ్యంలో ప్రజల మద్దతే కొలమాణంగా భారాస కదిలి కాంగ్రెస్ ను కూకటి వేళ్ళతో పెకిలించి వేస్తుందని...

కామారెడ్డి కాంగ్రెస్‌లో ఆసక్తికర పరిణామాలు – బండ్లు ఓడలు, ఓడలు బండ్లు?

Image
కాంగ్రెస్ లో బండ్లు ఓడలైతాయ్..ఓడలు బండ్లు ఐతాయ్ అనడంలో అతిశయోక్తి లేదు.. కాంగ్రెస్ లో ఏదైనా సాధ్యమే.. అచ్చం పచ్చి పులుసు అన్నట్లుగానే.. కామారెడ్డి కాంగ్రెస్ లో అలాంటి పరిణామాలే ఆసక్తికరంగా మారుతున్నాయి.. ప్రధాన స్రవంతి మీడియా ఈ పరిణామాలను పట్టించుకోకపోయినా... రాష్ట్ర రాజకీయా యవనికపై ప్రత్యేక పరిణామాలపై "మన నిజామాబాద్"అందిస్తున్న ప్రత్యేక కథనం ఇది..ఎవ్వరినో తక్కువ చేయాలని..ఇంకెవరినో ఆకాశానికెత్తాలనే ఉద్దేశం కాదు. వివరాల్లోకి వెళితే..... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లో ఉద్దండులైన మాజీ ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి,YS రాజశేఖర్ రెడ్డి లాంటి మహా మహులతో కలిసి పనిచేశారు ఆయన.. తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి PCC చీఫ్ గా నియా మకమైనపుడు సీనియర్లు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించారు.. ఏ ఒక్క బడా నేత PCC చీఫ్ ను తమ జిల్లాలకు రమ్మనలేదు.. ఆ టైమ్ లో రేవంత్ రెడ్డిని మొదటిసారి తన ఇలాఖ కు వెంట పెట్టుకుని తీసికెళ్లారు ఆ ముఖ్యనేత... ఆయనెవరో కాదు ..ఉమ్మడి రాష్ట్రాలలో మోస్ట్ సీనియర్ బడా నేత షబ్బీర్ అలీ.. అంత వరకు బాగానే ఉంది. కానీ...రేవంత్ రె...

ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేస్తే ఖబర్దార్: కవితపై బీజేపీ నేత దాంపల్లి జ్యోతి ఫైర్

Image
నిజామాబాద్, కల్వకుంట్ల కవిత మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి ఆరోపించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 39 వ డివిజన్ కార్పొరేటర్ దాంపల్లి జ్యోతి కవితపై ఘాటుగా విమర్శలు చేశారు. లిక్కర్ కేసులో కోట్లు సంపాదించిన మీరు కొత్త పార్టీ పేరు లిక్కర్ పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుందని ఆమె హితవు పలికారు. ఎందరో యువతీ యువకుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణను పదేళ్ల పాలనలో మీ డాడీ సగం తెలంగాణను నాశనం చేస్తే మీరు కొత్త పార్టీ అంటూ మిగిలిన సగాన్ని నాశనం చేసేందుకు వస్తున్నారని ఆమె ఆక్షేపించారు. మీ సొంత ఇంట్లోనే మీకు చక్కగా లేదని అలాంటిది రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారని , కొత్త పార్టీ పేరిట కోట్లు ఖర్చు పెడుతున్నారని దాంపల్లి జ్యోతి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బులతో కొత్త పార్టీ అంటూ కొత్త నాటకానికి తెర లేపారని జ్యోతి దుయ్యబట్టారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తుంటే చూసి ఓర్వలేక ఎంపీ అరవింద్ పై అవాకులు చవాకులు పేల్చడం సిగ్గుచేటు అన్నారు. ...