Posts

అన్నా నన్ను దేవుడే పంపిండు.. -జీవన్ రెడ్డి భావోద్వేగం

Image
ఎర్రవల్లి, కేసీఆర్ ను కలిసిన సందర్భంగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఎర్రవెల్లి నివాసానికి చేరుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు ఆయనను కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావుతో ఎర్రవెల్లి నివాసంలో, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి శుక్రవారం నాడు మర్యాదపూర్వక భేటీ అయ్యారు. నివాసానికి చేరుకున్న జీవన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్. రమణ, ఎమ్మెల్యే డా. కె. సంజయ్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే కె. విద్యాసాగర్ రావు, పార్టీ నేతలు గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు ఉన్నారు. జీవన్ రెడ్డి గారితో పాటు వచ్చిన వారిలో వారి కుమారులు, జగిత్యాల మాజీ జడ్పీ చైర్ పర్సన్ వసంత సురేశ్ దంపతులు తదితరులు ఉన్నారు. నిరంతరం తన నియోజకవర్గం, జిల్లా ప్రజలు, రైతుల గురించి ఆలోచన చేసే...

నిజామాబాద్ సెంట్రల్ జైలులో ఖైదీలకు ఎయిడ్స్, టిబి పరీక్షలు

Image
నిజామాబాద్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజు సెంట్రల్ జైలు లో దాదాపు 640 మంది ఖైదీలకు HIV/syphilis/hepatitis B &C &TB పరీక్షలు నిర్వహించారు.,అలాగే ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి డాక్టర్ల సహకారంతో కంటి పరీక్షలు, స్కిన్ ,డెంటల్ , గైనిక్ ,గుండెకు సంబంధించిన పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యా ఆరోగ్య అధికారి డాక్టర్ బి రాజశ్రీ, జిల్లా టిబి నియంత్రణ అధికారి & పోగ్రామ్ ఆఫీసర్ ఎయిడ్స్ అండ్ లెప్రసీ డాక్టర్ దేవి నాగేశ్వరి, NVHCP నోడల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేష్ , మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సామ్రాట్ యాదవ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అవంతి, డి హెచ్ ఈ ఘన్ పూర్ వెంకటేశ్వర్ , ఎయిడ్స్ నియంత్రణ సంస్థ సిబ్బంది, జిల్లా టిబి నియంత్రణ సిబ్బంది పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

టైగర్ నరేంద్ర 12వ వర్ధంతి – బీజేపీ నేతల ఘన నివాళులు

Image
నిజామాబాద్, హిందుత్వమే ఊపిరిగా, కాషాయమే ప్రాణంగా, పాతబస్తీ అరాచక శక్తుల పాలిట సింహస్వప్నమైన మన తెలంగాణ ముద్దుబిడ్డ స్వర్గీయ టైగర్ నరేంద్ర.. అయోధ్య ఉద్యమంలో కరసేవకులకు నాయకత్వం వహించి లాఠీ దెబ్బలు తిన్న చరిత్ర . భారతీయ జనసంఘ్ ఇందూరు జిల్లా ప్రచారక్గా పని చేశారు. మహనీయులు ఎంతో మంది కార్యకర్తలను జాతీయవాదం కోసం, ఈదేశం కోసం, ధర్మం కోసం నిర్మాణం చేసిన టైగర్ అలె నరేంద్ర భాయ్ సాబ్ 12 వర్ధంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మాదాసు స్వామి యాదవ్, ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి పర్సని వెంకటేష్ గారితో కలిసి ఘనమైన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఒబిసి మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ రాజ్ కుమార్ , కరుణ్ తోపాటు ఓబిసి మోర్చా నాయకులు పాల్గొన్నారు మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయంలో రచ్చ – నేతల మధ్య వాగ్వాదం, సస్పెన్షన్లు

Image
కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య రచ్చ రచ్చ జరిగింది. కాంగ్రెస్​ పార్టీ నిజామాబాద్​ జిల్లా కార్యాలయంలో నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డీసీసీ అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, ఎన్​ఎస్​యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణురాజ్​ మధ్య కొట్లాట జరిగింది. రాష్ట్ర కో ఆపరేటివ్ యూనియన్​​ ఛైర్మన్​, డీసీసీ మాజీ అధ్యక్షుడు మానాల మోహన్​రెడ్డి పుట్టిన రోజు వేడుకలను బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. వేణురాజ్​ ఆధ్వర్యంలో కార్యకర్తలు కేక్ చేయడానికి అంతా సిద్ధం చేశారు. ఇంతలోనే అయితే వారిని జిల్లా అధ్యక్షుడు నగేశ్​రెడ్డి, బర్త్డే వేడుకలను నాయకులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. జిల్లా అధ్యక్షుడికి, వేణురాజ్​కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు విచక్షణ మరిచి ఒక ప్రజా ప్రతినిధులం అని కూడా మర్చిపోయి ఓ స్థాయిలో ఒకరిని ఒకరు కాలర్లు పట్టుకొని కొట్టుకొనే వరకు ఘటన వెళ్ళింది. అయితే మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డికి ప్రస...

నిజామాబాద్‌లో భారీ సైబర్ మోసం బట్టబయలు – ₹152 కోట్ల లావాదేవీలు, 9 మంది అరెస్ట్ - శభాష్ CP సాయి చైతన్య

Image
నిజామాబాద్ జిల్లాలో ఇటీవల పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య సూచనల మేరకు ప్రత్యేక ఆపరేషన్ జరిగింది. ఈ ఆపరేషన్‌ను IV టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సతీష్ , సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా మొత్తం 9 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.. గతంలో కూడా ఈ కేసుకు సంబంధించి 7 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా, కర్ణాటక బ్యాంక్‌లో తప్పుడు ధ్రువపత్రాలు ఉపయోగించి అక్రమంగా కరెంట్ అకౌంట్లు ఓపెన్ చేసి, వాటిని మధ్యవర్తుల ద్వారా సైబర్ మోసగాళ్లకు విక్రయిస్తున్న నెట్‌వర్క్‌ను పోలీసులు వెలికితీశారు. ఈ నిందితులు ఫేక్ డాక్యుమెంట్స్‌తో బిజినెస్ అకౌంట్లు తెరిచి, వాటిని సైబర్ నేరాలకు ఉపయోగించే విధంగా అందించినట్లు గుర్తించబడింది. ఈ అకౌంట్ల ద్వారా కేవలం మూడు నెలల వ్యవధిలో సుమారు రూ. 152 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ కేసులో మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. మరికొంతమంది వ్యక్తులు ఇందులో ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తమవుతోంది. వారిని త్వరలో గుర...

నిజామాబాద్‌లో కిసాన్ న్యాయ్ సత్యాగ్రహం – కాంగ్రెస్ నేతల పిలుపు

Image
నిజామాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం కిసాన్ న్యాయ్ సత్యాగ్రహ కార్యక్రమం జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఊర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ , రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ సభ్యులు రామకృష్ణ , నగర మేయర్ ఉమారాణి , నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ , నూడా చైర్మన్ కేశ వేణు ,జిల్లా కాంగ్రెస్ పార్టీ కోశాధికారి భక్తవత్సలం , జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శరత్ , గాదారి గోపి జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ ,కార్పొరేటర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇 Click here to 👆 Follow Our WhatsApp Channel

కల్తీ పెట్రోల్ టెస్ట్ పేపర్లు ఇవ్వరిక్కడ...

Image
మాయ చేసి మత్మరించడంలో ఘనాపాటీలు ఇందూరు పెట్రోల్ బంక్ యజమానులు.. పెట్రోల్ క్వాలిటీ నిర్దారణ కోసం వినియోగ దారులకు ఉన్న చట్టబద్ధమైన హక్కును బాజాప్తాగా కాలరాస్తున్నారు. ప్రతి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నాణ్యత తాలూకు పరీక్ష కోసం వినియోగదారులకు ప్రీ పెట్రోల్ క్వాలిటీ టెస్టు పేపరును అందుబాటులో ఉంచాలి. ఈ విషయం వినియోగదారులకు తెలిసిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు వినియోగదారులకు తెలిసి క్వాలిటీ టెస్టు పేపర్ అడిగినా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు పెట్రోల్ బంక్ యజమానులు.. అచ్చంగా అలాంటి చేదు అనుభవం మన నిజామాబాద్ టీమ్ కు ఎదురైంది. నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ లో పెట్రోల్ టెస్టు పేపర్ అడిగితే తిక్క తిక్కగా వ్యవహరించారు . టెస్టు పేపర్ ఉండదని ఒకసారి.. వినియోగదారులకు ఇచ్చేది కాదని బుకాయించాడు బంక్ ఇంచార్జ్.టెస్ట్ పేపర్ అడిగితే వివ్వవల్సిందే అని DSO చెప్పారని అన్న వెంటనే.. అయితే DSO నే అడగండని తిక్క సమాధానం ఇచ్చారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం టెస్టు పేపర్ ఇవ్వాల్సిందే అని మన నిజామాబాద్ పట్టుబట్టగా చేసేది ఏమిలేక అయిష్టంగా పేపర్ ను చేతిలో పెట్టారు ...

BJP కార్పొరేటర్ వసూళ్లపై పోరాటం

Image
నిజామాబాద్, ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ మఠం పవన్ రాజకీయ కక్ష సాధింపుతో ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ పై పుకార్లు పుట్టిస్తూ జిల్లా కలెక్టర్ ,మున్సిపల్ కమిషనర్ లకి ఫిర్యాదు చేయడం అత్యంత హేయమైన చర్య అని ఆర్ ఆర్ రియల్ ఎస్టేట్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.... మున్సిపల్ ఎన్నికలలో గెలుపొందిన నిజామాబాద్ సౌత్ డివిజన్ల కార్పొరేటర్లకు సన్మానం చేయాలని సదుద్దేశంతో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ భవనము మరమ్మత్తులు జరుగుతుండడం వలన స్థానికంగా ఉన్న వాటర్ ప్లాంట్ లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వాటర్ ప్లాంట్ ను డాక్టర్ గ్రూప్ వారు 15 సంవత్సరములు అద్దెకు తీసుకున్నారని , ఇంకా ఏడు సంవత్సరాల కాల పరిమితి మిగిలి ఉందన్నారు. తాము అనుమతితో సన్మాన కార్యక్రమం నిర్వహించామని, సన్మాన కార్యక్రమంలో మఠం పవన్ ని కూడా సన్మానించామన్నారు. కానీ తాను రాజకీయ బురద చల్లడం కోసం వాటర్ ప్లాంట్ ను కబ్జా చేసేందుకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కార్పొరేటర్ గా ఎ...

కస్తూర్బా బాలికల విద్యాలయంను సందర్శించిన కలెక్టర్

Image
నిజామాబాద్,  వర్ని మండలం కోటయ్య క్యాంపులో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు.       పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ లను తనిఖీ చేశారు. విద్యార్థులకు సిద్ధం చేసిన మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని నిర్వాహకులను ఆదేశించారు. పాఠశాల పరిసరాలు నిశితంగా పరిశీలించిన కలెక్టర్, పరిశుభ్రత పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు. బాలికల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను లోనికి అనుమతించకూడదని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అనంతరం 7వ తరగతి గదిని కలెక్టర్ సందర్శించి, విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు. తన వెంట తెచ్చిన డైరీలు, చాక్లెట్లు, బహుమతులను అందించారు. చక్కగా చదువుకోవాలని, అదే సమయంలో వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని జాగ్రత్తలు సూచ...