కల్తీ పెట్రోల్ టెస్ట్ పేపర్లు ఇవ్వరిక్కడ...
మాయ చేసి మత్మరించడంలో ఘనాపాటీలు ఇందూరు పెట్రోల్ బంక్ యజమానులు..
పెట్రోల్ క్వాలిటీ నిర్దారణ కోసం వినియోగ దారులకు ఉన్న చట్టబద్ధమైన హక్కును బాజాప్తాగా కాలరాస్తున్నారు.
ప్రతి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నాణ్యత తాలూకు పరీక్ష కోసం వినియోగదారులకు ప్రీ పెట్రోల్ క్వాలిటీ టెస్టు పేపరును అందుబాటులో ఉంచాలి. ఈ విషయం వినియోగదారులకు తెలిసిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు వినియోగదారులకు తెలిసి క్వాలిటీ టెస్టు పేపర్ అడిగినా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు పెట్రోల్ బంక్ యజమానులు..
అచ్చంగా అలాంటి చేదు అనుభవం మన నిజామాబాద్ టీమ్ కు ఎదురైంది. నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ లో పెట్రోల్ టెస్టు పేపర్ అడిగితే తిక్క తిక్కగా వ్యవహరించారు .
టెస్టు పేపర్ ఉండదని ఒకసారి..
వినియోగదారులకు ఇచ్చేది కాదని బుకాయించాడు బంక్ ఇంచార్జ్.టెస్ట్ పేపర్ అడిగితే వివ్వవల్సిందే అని DSO చెప్పారని అన్న వెంటనే.. అయితే DSO నే అడగండని తిక్క సమాధానం ఇచ్చారు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం టెస్టు పేపర్ ఇవ్వాల్సిందే అని మన నిజామాబాద్ పట్టుబట్టగా చేసేది ఏమిలేక అయిష్టంగా పేపర్ ను చేతిలో పెట్టారు బంక్ ఇంచార్జి..
జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా వినియోగదారుల సంఘాలు, సివిల్ సప్లయ్స్ అధికారులు రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది..
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇
పెట్రోల్ క్వాలిటీ నిర్దారణ కోసం వినియోగ దారులకు ఉన్న చట్టబద్ధమైన హక్కును బాజాప్తాగా కాలరాస్తున్నారు.
ప్రతి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ నాణ్యత తాలూకు పరీక్ష కోసం వినియోగదారులకు ప్రీ పెట్రోల్ క్వాలిటీ టెస్టు పేపరును అందుబాటులో ఉంచాలి. ఈ విషయం వినియోగదారులకు తెలిసిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు వినియోగదారులకు తెలిసి క్వాలిటీ టెస్టు పేపర్ అడిగినా ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు పెట్రోల్ బంక్ యజమానులు..
అచ్చంగా అలాంటి చేదు అనుభవం మన నిజామాబాద్ టీమ్ కు ఎదురైంది. నిజామాబాద్ నగరంలోని వంశీ హోటల్ ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ లో పెట్రోల్ టెస్టు పేపర్ అడిగితే తిక్క తిక్కగా వ్యవహరించారు .
టెస్టు పేపర్ ఉండదని ఒకసారి..
వినియోగదారులకు ఇచ్చేది కాదని బుకాయించాడు బంక్ ఇంచార్జ్.టెస్ట్ పేపర్ అడిగితే వివ్వవల్సిందే అని DSO చెప్పారని అన్న వెంటనే.. అయితే DSO నే అడగండని తిక్క సమాధానం ఇచ్చారు.
వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 1986 ప్రకారం టెస్టు పేపర్ ఇవ్వాల్సిందే అని మన నిజామాబాద్ పట్టుబట్టగా చేసేది ఏమిలేక అయిష్టంగా పేపర్ ను చేతిలో పెట్టారు బంక్ ఇంచార్జి..
జిల్లా అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా వినియోగదారుల సంఘాలు, సివిల్ సప్లయ్స్ అధికారులు రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది..
మీ Whatsapp లోకి మన నిజామాబాద్ న్యూస్ ను పొందడానికి ఇప్పుడే మన Whatsapp Channel ను Follow అవ్వండి 👇

Click here to 👆 Follow Our WhatsApp Channel