Posts

Showing posts with the label Congress news

నిజామాబాద్‌లో సంజయ్ అనుచరుల ఫ్లెక్సీ వార్ – ‘జస్టిస్ ఫర్ DSR’ డిమాండ్

Image
నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ఉదయం ‘జస్టిస్ ఫర్​ డి ఎస్ ఆర్ ’​ పేరుతో ఫ్లెక్సీలు నగరవ్యాప్తంగా ఎక్కడ చూసినా దర్శనమిచ్చాయి. నిజామాబాద్​ తొలి మేయర్​ ధర్మపురి సంజయ్​కి న్యాయం చేయాలంటూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. మొన్నటివరకు జరిగిన అసెంబ్లీ, మున్సిపల్​ ఎన్నికల్లో పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడి పార్టీ అభ్యర్థుల గెలుపునకు మాజీ మేయర్​ ధర్మపురి సంజయ్​ కృషి చేశారని అయినా ఆయనకు పార్టీలో గుర్తింపు ఇవ్వట్లేదంటూ ఫ్లెక్సీల్లో రాసి ఉంది. ఒకప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు వైఎస్​తో కలిసి డీఎస్​ ఎంతో కృషి చేసినప్పటికీ ఆయన కుమారుడికి పార్టీలో ఎందుకు గుర్తింపు ఇవ్వట్లేదని ఫ్లెక్సీల్లో ఆయన అభిమానులు ప్రశ్నించారు. నిజామాబాద్​ యువత, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరుల పేర్లతో కూడిన ఈ ఫ్లెక్సీల్లో డి.సంజయ్​ వెంటే తాము ఉంటాయని.. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలోనే తాముంటాని పేర్కొన్నారు. అలాగే నగరంలోని ధర్నాచౌక్​ వద్ద ధర్మపురి సంజయ్​ అభిమానుల పేరుతో శనివారం ఉదయం నిరాహార దీక్ష సైతం చేపట్టారు. డీఎస్​కుసంజయ్​కి పదవి ఇచ్చి గౌరవించాలని వారు కోరారు. అయితే తాజాగా వెలిసిన ఫ్లెక్సీల అంశం న...

డీఎస్ సమాధి సాక్షిగా ఇచ్చిన మాట నిలబెట్టాలి – సంజయ్‌కు పదవి ఇవ్వాలని డిమాండ్

Image
మాజీ మంత్రి డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర తొలి మేయర్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షులు ధర్మపురి సంజయ్​కు రాష్ట్ర ప్రభుత్వంలో ఆయనకు తగ్గ పదవి ఏదైనా రాష్ట్రవ్యాప్తంగా ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్​ చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ లో ఆయన అభిమానులు శనివారం నిరసన దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న డి.సంజయ్​కు గుర్తింపు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, మున్సిపల్​ ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల గెలుపు కోసం ఎంతగానో సేవలు అందించారని వారు గుర్తు చేశారు. ఒక విధంగా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడంలో సంజయ్ పాత్ర కూడా ఉందంటంలో ఏమాత్రం అతిశయోక్తి కాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు డిఎస్ మరణం తర్వాత ఆయన సమాధి వద్ద ఇచ్చిన ప్రమాణం నిలబెట్టుకోవాలన్నారు. ఆయన సేవలను గుర్తించి పదవి ఇవ్వాలని వారు కోరారు. ధర్మపురి సంజయ్ ఏ పార్టీలో ఉన్నా తాము ఆయన వెన్నంటే ఉంటామన్నారు. కార్యక్రమంలో సంజయ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ సీనియర...

మహిళలను కోటీశ్వరులను చేస్తాం: కామారెడ్డిలో షబ్బీర్ అలీ హామీ

Image
📍 కామారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.52 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. 👉 డ్వాక్రా మహిళల కోసం రూ.10 లక్షలతో మహిళా భవనం నిర్మాణానికి, 👉 పిల్లల సంక్షేమం కోసం రూ.12 లక్షలతో అంగన్వాడి భవనం, 👉 గ్రామ అభివృద్ధి కోసం రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 💬 ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరచి కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతరంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు సుతారి రమేష్, భీమ్ రెడ్డి, అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, డీసీసీ ఉపాధ్యక్షులు గం...

ఏమి తక్కువ చేసాము? జీవన్ రెడ్డి ఆరోపణలపై మానాల మోహన్ రెడ్డి కౌంటర్

Image
📍 నిజామాబాద్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన ఆరోపణలను రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ ఛైర్మెన్ మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. జీవన్ రెడ్డి పార్టీని విడిచిపోతుండటం బాధాకరమని పేర్కొన్న ఆయన, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు. 👉 రాష్ట్రంలో రాక్షస పాలనకు తెరదింపిన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు. జీవన్ రెడ్డి తన వయసుకు, విజ్ఞతకు తగిన విధంగా మాట్లాడాలని సూచించారు. పార్టీ అధిష్టానం నిర్ణయాల మేరకే చేరికలు జరుగుతాయని స్పష్టం చేశారు. 💬 “మీ పోరాటం సీఎం పై కాకుండా ప్రజా సమస్యలపై ఉండాలి” అని మోహన్ రెడ్డి అన్నారు. వేం నరేందర్ రెడ్డి క్లిష్ట కాలంలో కాంగ్రెస్ పార్టీకి విశేష సేవలు అందించారని, గత తొమ్మిదేళ్లుగా పార్టీ అభివృద్ధికి కృషి చేశారని గుర్తుచేశారు. జీవన్ రెడ్డి ప్రతి సారి ఓడిపోయినా కూడా పార్టీ ఆయనకు ప్రాధాన్యత ఇచ్చిందని మానాల మోహన్ రెడ్డి పేర్కొన్నారు. Follow Our WhatsApp Channel