మహిళలను కోటీశ్వరులను చేస్తాం: కామారెడ్డిలో షబ్బీర్ అలీ హామీ

📍 కామారెడ్డి,
కామారెడ్డి నియోజకవర్గంలోని బిక్నూర్ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ అలీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మొత్తం రూ.52 లక్షల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు.
👉 డ్వాక్రా మహిళల కోసం రూ.10 లక్షలతో మహిళా భవనం నిర్మాణానికి,
👉 పిల్లల సంక్షేమం కోసం రూ.12 లక్షలతో అంగన్వాడి భవనం,
👉 గ్రామ అభివృద్ధి కోసం రూ.30 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
💬 ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారతపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరచి కోటీశ్వరులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని, సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతరంగా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పిసిసి జనరల్ సెక్రటరీ ఇంద్రకరణ్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, మండల అధ్యక్షులు సుతారి రమేష్, భీమ్ రెడ్డి, అనంతరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు, డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్, ఐరేనీ సందీప్, దేవరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
👉 స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్