Posts

Showing posts with the label Harish Rao

సత్యసాయి సంజీవని ఆస్పత్రి సేవలు అమోఘం.. నా ఏడాది జీతాన్ని ట్రస్ట్‌కు అందిస్తా: హరీష్ రావు

Image
సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రి లో ' గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ' కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ✳️ఈ చిన్నారులకు మళ్ళీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన మా వైద్యులకు, ఈ ఆసుపత్రిలో ఎంతో అంకితభావంతో, ప్రేమతో, సహనంతో, ఓర్పుతో చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న వైద్య బృందానికి, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. ✳️నిజంగా శ్రీనివాస్ గురించి నేను పొగడటానికి మాట్లాడటం లేదు. నా హృదయం నుంచి వచ్చిన మాట ఒక్కటే చెబుతున్నాను. శ్రీనివాస్ మనకు కనిపించే దేవుడు. ✳️దేవాలయంలో కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తాం. మన కష్టాలు తొలగించాలని, మన బాధలు దూరం చేయాలని చేతులు జోడించి వేడుకుంటాం. కానీ శ్రీనివాస్ గారు ఈ ఆసుపత్రి ద్వారా ప్రతి సంవత్సరం వేలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చిన్నారుల కళ్లలో ఆనందాన్ని, తల్లిదండ్రుల కళ్లలో ఆశను చూస్తుంటే నిజంగా నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. ✳️ప్రతి సంవత్సరం సుమారు ఆరు వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందిస్తూ వా...

మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ బిగ్ ఫైట్.. పూజల్లో తరిచిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) హైదరాబాద్, జులై 2; తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్నట్లు ఉంది రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారం.. అచ్చం ఈ సామెతకు సరిపోయే రాజకీయ సన్నివేశాలు హైదరాబాద్ గడ్డ మీద ఆవిష్కృతం అయ్యాయి. వివరాల్లోకి వెళితే... ప్రభుత్వం ,ప్రధాన ప్రతిపక్షమైన BRS నడుమ గురువారం హైదరాబాద్ లో బిగ్ ఫైట్ జరిగింది.. రేవంత్ రెడ్డి ఘన కార్యాలను తెలంగాణ భవన్ కు వచ్చి చెబుతా అని మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. దానికి స్పందించిన కేటీఆర్, హరీష్ రావు ఇన్ టైంలో వచ్చి కూర్చున్నారు.అదే టైంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి బస్తీమే సవాల్ అంటూ గన్ పార్క్ అమర వీరులస్తూపం వద్ద బహిరంగ చర్చ కోసం మకాం వేశారు.. అక్కడికి చేరుకునేందుకు మొదట హరీష్ రావు తెలంగాణ భవన్ బయట పోలీసులతో పెద్ద యుద్ధమే చేశారు. తోపులాట,పోలీసుల బల ప్రయోగంతో హరీష్ కింద పడి పోయారు.. ఈ నాటకీయ రాజకీయ పరిణామాలు గురువారం రాష్ట్ర వ్యాపితంగా హల్చల్ రేపాయి. సీన్ కట్ చేస్తే.. ఈ మొత్తం వ్యవహారంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆంటీ ముట్టనట్లు ఉన్నారు. ఎక్కడా కనపడలేదు.. పల్లెత్తు మాట్లాడలేదు..రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో మం...

నో టికెట్ గ్యారెంటీ..! గేరు మార్చిన బీఆర్ఎస్.. మాజీ ఎమ్మెల్యేల్లో టెన్షన్

Image
(జమాల్పూర్ గణేష్ /మూల్పూరు రాజేంద్ర బాబు) కారు పార్టీ గేరు మార్చింది.. ఆ స్పీడుకు MLA టికెట్ల ఆశావాహుల కండ్లు బైర్లు కమ్ముతున్నాయి.. రామన్న, హరిషన్న చుట్టూ ప్రదక్షిణ చేసి.. మస్క పాలిస్ తో టికెట్ కొట్టేయొచ్చనే ఆశలు ఆడియాసలే నన్న అంచనా కొచ్చారు BRS మాజీ MLA లు..ఇంత కాలం పట్న వాసానికి మరిగిన వీళ్ళు అబ్బా మళ్ళీ ఊరు బాట పట్టాలా అంటూ ఉసూరు మంటున్నారు..10ఏళ్ళు అధికారం చెలాయించి, సుఖానికి మరిగిన మాజీ MLA లు ఇప్పుడిపుడే పల్లె బాటను వెతుక్కుంటున్నరు. ఎవరికి వారు విధిగా ఓడిన చోటే విజయానికి మెట్లు వేసుకుంటారేనని అధిష్ఠానం రెండేళ్లు సమయం ఇచ్చి చూసింది.. అయినా మాజీలు పట్నం వీడలేదు.. అందుకే బూతు లెవల్ లో పార్టీ నిర్మాణం, సర్ ప్రోగ్రామ్ ను జోడించి అధిష్టానమే కార్యాచరణ ఇచ్చింది. దీనితో తప్పని పరిస్థితుల్లో మాజీ MLA లు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు పూర్తి చేశారు.మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో మాజీలు టీమ్ గా ఏర్పడి పర్యటిస్తున్నారు.. అయినా వారిని టికెట్ నో గ్యారంటీ అనే మాట నిద్రపోనిస్తా లేదు. "గతాన్ని చూసి టికెట్లు ఇచ్చేది లేదు..ఎంత సీనియర్..ఎన్ని టర్మ్ లు MLA గా పని చేసారు అనేది ల...

హరీష్ రావు అడ్డాలో మార్పు జపం

Image
BRS బాహుబలి హరీష్ రావు అడ్డా అయిన సిద్దిపేట గడ్డమీద సీఎం రేవంత్ రెడ్డి మార్పు మంత్రం వల్లించారు. ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం ఒక్కసారి సిద్దిపేట లో సిట్టింగ్ MLA హరీష్ రావు కు బదులు కాంగ్రెస్ ను గెలిపించాలని సిద్దిపేట ఓటర్లను అభ్యర్తించారు. హరీష్ రావు చెబుతున్నట్లు సిద్దిపేట మీద వివక్ష చూపలేదన్నారు సీఎం.10 ఏళ్ల BRS పాలనలో నా కొడంగల్ మీద వివక్ష చూపారని ఎదురు దాడికి దిగారు రేవంత్ రెడ్డి. ప్రసంగం మొత్తం హరీష్ రావు చుట్టే సాగడం విశేషం.. ప్రైవేటు మోజులో పడకుండా విద్యార్థులను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా రంగంలో మార్పులు తీసుకొస్తున్నామని, ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకంటే ఉన్నతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో మీట నొక్కి రాష్ట్ర రైతాంగానికి రైతు భరోసా (Rythu Bharosa) నిధులను విడుదల చేశారు. నర్మెట్టలో నిర్మించిన ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితమిచ్చారు. తర్వాత జిల్లాలో 775 కోట్...