Posts

Showing posts with the label Nizamabad updates

ఎంపీ అరవింద్‌పై విమర్శలు చేస్తే ఖబర్దార్: కవితపై బీజేపీ నేత దాంపల్లి జ్యోతి ఫైర్

Image
నిజామాబాద్, కల్వకుంట్ల కవిత మతిభ్రమించి మాట్లాడుతున్నారని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దాంపల్లి జ్యోతి ఆరోపించారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో 39 వ డివిజన్ కార్పొరేటర్ దాంపల్లి జ్యోతి కవితపై ఘాటుగా విమర్శలు చేశారు. లిక్కర్ కేసులో కోట్లు సంపాదించిన మీరు కొత్త పార్టీ పేరు లిక్కర్ పార్టీ అని పెట్టుకుంటే బాగుంటుందని ఆమె హితవు పలికారు. ఎందరో యువతీ యువకుల ఆత్మ బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణను పదేళ్ల పాలనలో మీ డాడీ సగం తెలంగాణను నాశనం చేస్తే మీరు కొత్త పార్టీ అంటూ మిగిలిన సగాన్ని నాశనం చేసేందుకు వస్తున్నారని ఆమె ఆక్షేపించారు. మీ సొంత ఇంట్లోనే మీకు చక్కగా లేదని అలాంటిది రాష్ట్రాన్ని ఏమి ఉద్ధరిస్తారని , కొత్త పార్టీ పేరిట కోట్లు ఖర్చు పెడుతున్నారని దాంపల్లి జ్యోతి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన డబ్బులతో కొత్త పార్టీ అంటూ కొత్త నాటకానికి తెర లేపారని జ్యోతి దుయ్యబట్టారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తుంటే చూసి ఓర్వలేక ఎంపీ అరవింద్ పై అవాకులు చవాకులు పేల్చడం సిగ్గుచేటు అన్నారు. ...

నిజామాబాద్ కార్పొరేషన్ బడ్జెట్ 2026-27 ఆమోదం.. రూ.231కోట్ల వ్యయం

Image
నిజామాబాద్, నిజామాబాద్ నగరపాలక సంస్థ 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రతిపాదించిన బడ్జెట్ ఆమోదం పొందింది. శనివారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ కూరగాయల ఉమారాణి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్, నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, కలెక్టర్ ఇలా త్రిపాఠి, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ పాల్గొన్నారు. 2026-2027 సంవత్సరానికి సంబంధించిన ప్రతిపాదిత బడ్జెట్ తో పాటు, 2025 - 2026 సవరించిన అంచనా బడ్జెట్ ను సమావేశంలో ప్రవేశపెట్టగా, కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 2025 ఏప్రిల్ 01 నాటికి ప్రారంభ నిల్వ రూ. 9471.33 లక్షలు, 2025-2026 సవరణ అంచనా ఆదాయం రూ. 13717.11 లక్షలు కలుపుకుని మొత్తం రూ. 23188.44 లక్షలుగా పేర్కొన్నారు. 2026-2027 సంవత్సరపు సాధారణ నిధుల అంచనా ఆదాయం రూ. 14763.60 లక్షలుగా బడ్జెట్ లో పొందుపర్చారు. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ గ్రాంట్ల ద్వారా రూ. 9937.00 లక్షల ఆదాయం సమకూరుతుందని అంచనా వేశారు. అదేవిధంగా మొత్తం అంచనా వ్యయం రూ. 24700.60 లక్షలుగా బడ్జెట్ పద్దులో పేర్కొన్నారు. ప్రతిపాదిత బడ్...

నిజామాబాద్‌లో ఇంధన కొరత లేదు.. వదంతులు నమ్మొద్దు: అధికారి శ్రీకాంత్ రెడ్డి

Image
📍 నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పెట్రోల్, డీజిల్ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని పౌరసరఫరాల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. ఇంధన కొరతపై వస్తున్న వదంతులను ప్రజలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. 👉 జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆధ్వర్యంలో పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో ఐఓసీఎల్ ఆధీనంలో 62 బంకుల్లో రోజుకు సుమారు 3.94 లక్షల లీటర్ల పెట్రోల్, 4.59 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. 👉 హెచ్‌పీసీఎల్ పరిధిలో 64 బంకుల్లో 3.54 లక్షల లీటర్ల పెట్రోల్, 3.83 లక్షల లీటర్ల డీజిల్, 👉 భారత్ పెట్రోలియం పరిధిలో 69 బంకుల్లో 3 లక్షల లీటర్ల పెట్రోల్, 3.5 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 211 పెట్రోల్ బంకుల్లో ప్రతి రోజు సగటున 1.50 లక్షల లీటర్ల పెట్రోల్, 2.60 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయని వివరించారు. 💬 కృత్రిమంగా కొరత సృష్టించే బంకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 👉 ఎల్పీజీ సిలిండర్ల కొరత కూడా లేదని, బుకింగ్ ప్రక్రియ సాధారణంగానే కొనసాగుతోందన్నారు. డొమెస్టిక్ సిలిండర్లన...

హనుమాన్ ర్యాలీకి లక్షకు పైగా భక్తులు.. VHP భారీ ఏర్పాట్లు

Image
📍 నిజామాబాద్, ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ ధరణి ర్యాలీని విజయవంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ (VHP) నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో, ఈసారి లక్షకు పైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. 👉 ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా హనుమాన్ శోభాయాత్రను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత సంవత్సరం కూడా లక్షకు పైగా భక్తులు పాల్గొన్నారని, ఈసారి మరింత భారీగా స్పందన ఉండే అవకాశం ఉందన్నారు. 💬 ఈ ర్యాలీ విజయవంతం కావడానికి ప్రజలతో పాటు పోలీసు శాఖ, మున్సిపల్ అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 👉 నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ హిందూ విభాగం కార్యదర్శి కృష్ణాజీ దినేష్ ఠాగూర్, విహెచ్పి జిల్లా అధ్యక్షులు, హిందూ వాహిని జిల్లా అధ్యక్షులు దాసరి సాయి ప్రసాద్, దాత్రిక రమేష్, శేఖర్, నికేష్ తదితరులు పాల్గొన్నారు. 👉 మీరు ఈ ర్యాలీలో పాల్గొంటారా? కామెంట్ చేయండి 💬 👉 మరిన్ని తాజా వార్తల కోసం Mana Nizamabad ను ఫాలో అవ్వండి 🔔 Follo...