Posts

Showing posts with the label telangana

మేయర్ ఉమారాణి పార్కుల బాట.. - వినాయక్ నగర్ వాకర్స్ తో భేటీ

Image
నిజామాబాద్ నగరం వినాయక్ నగర్ లో కల తెలంగాణ అమర వీరుల పార్క్ ను నగర మేయర్ ఉమారాణి రమేష్ సందర్శించచారు .అమర వీరుల పార్క్ లో సమస్యలను వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు .అమర వీరుల స్తూపం లో వర్షాకాలంలో నీరు నిలిసి లీకేజీ అవుతుందని, వాకర్స్ కు టాయిలెట్ సౌకర్యం కల్పించాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, వర్ష కాలం లో నీరు నిలవకుండా డ్రైనేజ్ నిర్మించాలని, త్రాగునీటి వసతి కల్పించాలని, దోమలు రాకుండా ప్రతి రోజు ఫ్యాగింగ్ చేయాలని, ఎక్సర్సైజ్ చేసే మిషన్ లను రిపేర్ చేయించాలని, ప్రతి రోజు చెత్త ను ఎత్తివేయాలని కోరారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సుమారు 500 మంది సీనియర్ సిటిజన్స్ , పెద్దలు , మహిళలు, యువకులు , చిన్న పిల్లలు వస్తున్నారని ... అమర వీరుల పార్క్ పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలని వాకర్స్ సబ్యులు వినోద్ కుమార్, ఆయుష్ పురు షో తం, రాజేందర్, రమేష్, దయానంద్, సాయగౌడ్, సంపత్, శ్రీనివాస్ గౌడ్, సామల ఒడ్డేన్న, చిన్నారెడ్డి కోరారు. పార్క్ కు మొదటిసారి వచ్చి సందర్శించినందుకు మేయర్ మేడమ్ కు వాకర్స్ శాలువాతో సత్కరించారు. పార్క్ లో అందరికీ అన్ని సౌకర్యాలు కల్...

భాషకు ప్రాణం పోసిన అక్షర సేనాని... తెలిదేవర భానుమూర్తికి కన్నీటి వీడ్కోలు

Image
తెలంగాణ మట్టి వాసనను, ఆ భాషా సౌందర్యాన్ని హిమాలయమంత ఎత్తున నిలబెట్టిన నా ఆత్మీయ మిత్రుడు తెలిదేవర భానుమూర్తి (73) గారు మల్కాజ్‌గిరిలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్షరం ముక్కలైనట్లు, ఒక భాషా నిధి కనుమరుగైనట్లు నా మనసు విలపిస్తోంది.  తెలంగాణ భాషకు అస్తిత్వ శిఖరం హైదరాబాద్‌ గల్లీల్లో వినిపించే సామాన్యుడి గొంతును, ఆ భాషలోని నుడికారాన్ని ప్రపంచ యవనికపై సగర్వంగా నిలబెట్టిన ఘనత ఆయనది. కేవలం రచనలు చేయడం మాత్రమే కాదు, తెలంగాణ యాసను, ఆ అస్తిత్వాన్ని తన ఊపిరిగా మలచుకున్న నిఖార్సైన కవి, జర్నలిస్ట్ ఆయన. 1995లో 'వార్త' తెలుగు దినపత్రిక ఆరంభంలో నిజామాబాద్ ఎడిషన్‌లో మా ప్రయాణం మొదలైంది. సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్ గారి సారథ్యంలో... భానుమూర్తి ఎడిషన్ ఇన్‌ఛార్జిగా, నేను ఎడిషన్ చీఫ్‌గా కలిసి అడుగులు వేశాం. "పత్రికా భాష అంటే కేవలం ఒక ప్రాంతానిదే కాదు, అది ప్రజల భాష కావాలని కలలు గన్న సాహితీ మూర్తి ఆయన." ఆ రోజుల్లో వార్తాపత్రికలపై ఒకే తరహా ఆంధ్ర భాషా ఆధిపత్యం నడుస్తున్న తరుణంలో, తెలంగాణ వాడుక భాషను వార్తా రచనలోకి తెచ్చిన సా...

కాంగ్రెస్ లో బడా నేత ప్రతిష్టకు ముడుపుల మరక.

Image
జమాల్పూర్ గణేష్.... ✍︎ బడా నేత నిర్వాకం కాంగ్రెస్ లో కలవరం రేకెత్తిస్తోంది. పార్టీతో ఏమాత్రం సంబంధం లేని కాటిపల్లి నరేందర్ రెడ్డి సతీమణిని ప్రతిష్టాత్మక నిజామాబాద్ మేయర్ పీఠంపై కూర్చోపెట్టడానికి బడా నేత వేసిన స్కెచ్చు బెడిసి కొడుతుందనే భయం పార్టీ శ్రేణుల్లో కనపడుతోంది.. రాజకీయ సంకట స్థితికి దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు..10కోట్లు నజరానా తీసుకుని నరేందర్ రెడ్డి కి మేయర్ సీటును కట్టబెడుతున్నారని ఎంపీ అర్వింద్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ను కడిగి పారేశారు.దీనివల్ల బడా నేతకే కాకుండా పార్టీ ప్రతిష్ట మసక పారడం ఎన్నికల్లో ప్రభావం చూపే ప్రమాదం పొంచి ఉందని క్యాడర్ టెన్షన్ పడుతోంది.డబ్బు సంచులు చేతులు మారడం వల్లనే పార్టీకి సంబంధం లేని వ్యాపార దిగ్గజం తెర మీదికి వచ్చిందనే ప్రచారం క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీనితో పార్టీ శ్రేణులు డిఫెన్స్ లో పడ్డాయి..అందుకే  బడా నేత నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించనూ లేదు.. వ్యతిరేకుంచనూ లేదు నాయకత్వ గణం.. చివరకు పార్టీ జిల్లా నాయకత్వం కూడా పెదవి విప్పే సాహసం చేయ లేదు..కోట్లు తీసుకుని కాటిపల్లికి భరోసా ఇచ్చారని అర్వింద్ సోషల్...

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

Image
  ✍︎... జమాల్పూర్ గణేష్ :- కాంగ్రెసు పార్టీకి జవసత్వాలు పోస్తున్న క్యాడర్,లీడర్ల మనోభావాలను మందు పాతర పెట్టి ఖతం చేస్తున్న బడా నేత ఎవరనే చర్చ  చక్కర్లు కొడుతోంది.     కాసు బ్రహ్మానంద రెడ్డి జమానాలో అప్పటి ఆర్థిక మంత్రి అర్గుల్ రాజారాం నుంచి మొదలుకుని YS రాజశేఖర్ రెడ్డి హయాంలో డి. శ్రీనివాస్(DS) వరకు కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో పార్టీ సీనియర్లకు రాజకీయ అవకాశాలు దక్కాయి. పార్టీలోనూ..రాజ్యాంగ బద్ధ పదవుల్లోనూ పార్టీకి పునాదిగా పనిచేయడం ద్వారా పైకి వచ్చిన వారికే అవకాశాలు దక్కాయి. ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయింది.పార్టీ కోసం భుజాలు అరిగే దాకా జెండాలు మోసి..రాస్తారోఖో..రైల్ రోఖో.. బంద్ కరో బంద్ కరో అంటూ నోర్లు బొంగురు పోయే దాకా అరిచి నెత్తి నోరు కొట్టుకున్న నిఖార్సయిన ,నిజమైన కాంగ్రెస్ క్యాడర్ కు లాస్ట్ బెంచే దిక్కయ్యింది..   ఖరీదైన ఖద్దరు బట్టలేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం హయాం లో మండవ వెంకటేశ్వర రావుతో రాసుకు పూసుకు తిరిగిండు..BRS ఏలుబడిలో అప్పటి మంత్రి ప్రశాంత్ రెడ్డి,కల్వకుంట్ల కవితతో చనువుగా ఉంటుండే..ఇప్పుడు PCC చీఫ్ మహేష్ తో పాటు సర్కార్ సలహదారులు సుదర్శన్ రెడ్డ...