మేయర్ ఉమారాణి పార్కుల బాట.. - వినాయక్ నగర్ వాకర్స్ తో భేటీ

నిజామాబాద్ నగరం వినాయక్ నగర్ లో కల తెలంగాణ అమర వీరుల పార్క్ ను నగర మేయర్ ఉమారాణి రమేష్ సందర్శించచారు .అమర వీరుల పార్క్ లో సమస్యలను వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు .అమర వీరుల స్తూపం లో వర్షాకాలంలో నీరు నిలిసి లీకేజీ అవుతుందని, వాకర్స్ కు టాయిలెట్ సౌకర్యం కల్పించాలని, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని, వర్ష కాలం లో నీరు నిలవకుండా డ్రైనేజ్ నిర్మించాలని, త్రాగునీటి వసతి కల్పించాలని, దోమలు రాకుండా ప్రతి రోజు ఫ్యాగింగ్ చేయాలని, ఎక్సర్సైజ్ చేసే మిషన్ లను రిపేర్ చేయించాలని, ప్రతి రోజు చెత్త ను ఎత్తివేయాలని కోరారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సుమారు 500 మంది సీనియర్ సిటిజన్స్ , పెద్దలు , మహిళలు, యువకులు , చిన్న పిల్లలు వస్తున్నారని ... అమర వీరుల పార్క్ పై ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని సమస్యలను పరిష్కరించాలని వాకర్స్ సబ్యులు వినోద్ కుమార్, ఆయుష్ పురు షో తం, రాజేందర్, రమేష్, దయానంద్, సాయగౌడ్, సంపత్, శ్రీనివాస్ గౌడ్, సామల ఒడ్డేన్న, చిన్నారెడ్డి కోరారు. పార్క్ కు మొదటిసారి వచ్చి సందర్శించినందుకు మేయర్ మేడమ్ కు వాకర్స్ శాలువాతో సత్కరించారు. పార్క్ లో అందరికీ అన్ని సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. మేయర్ మేడమ్ పార్క్ చుట్టూ తిరిగి మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారు. వాకర్స్ సబ్యులు పార్క్ ఎక్సర్సైజ్ మిషన్ లమెయింటెన్స్ ను మున్సిపల్ కార్పొరేషన్ అప్పచెప్పాలని కోరారు.

Popular posts from this blog

ఇందూరు మేయర్ హస్తగతం - MIM పొత్తుకు ఓకే - నేడు సీఎం తో మహేష్ గౌడ్ భేటీ

IMA లో ఆగమాగం - వైద్యుల్లో టెన్షన్

అర్వింద్ మౌనము వెనుక? అంతు చిక్కడు-ఆగం చేస్తడు!

మహేష్ మంత్రాంగం సక్సెస్ మేయర్ పీఠంపై కూరగాయల ఉమ

కాంగ్రెస్ ను ఖతం చేస్తున్న బడా నేత ఎవరు?

హరీష్ రావు,కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ....మర్మమేమిటి గోపాలా!

ఇందూరులో కమల వికాసం కమ్మేయడానికి కాంగ్రెస్ స్కెచ్

మీనాక్షి నటరాజన్ జోష్.. చప్పట్లతో PCC చీఫ్ హంగామా..

మంద కృష్ణ మాదిగపై కుట్ర CMO కనుసన్నల్లో యాక్షన్ టీమ్స్