Posts

Showing posts with the label BRS news

ఏప్రిల్ 25న కొత్త రాజకీయ పార్టీ ప్రకటన: కల్వకుంట్ల కవిత సంచలన ప్రకటన

Image
నిజామాబాద్, ఏప్రిల్ 25న రాజకీయ పార్టీ ప్రకటిస్తామని తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ప్రకటించారు. శుక్రవారం నిజామాబాద్లో జరిగిన విలేకరుల సమావేశంలో అనేక విషయాలను వెల్లడించారు.. కవిత మాటల్లోనే.. *రాజకీయ పార్టీగా మారబోతోంది తెలంగాణ జాగృతి. *ఏప్రిల్ 25న మునీరాబాద్ వేదికగా పార్టీ జెండా, అజెండాను ప్రకటిస్తాం. *తెలంగాణ భవిష్యత్ మార్చే దారి దీపం కాబోతున్నాం. *సర్వోదయ తెలంగాణ కావాలన్నదే మా లక్ష్యం. ఆ లక్ష్యం కోసం పనిచేస్తాం. *మేము పెట్టబోయే పార్టీ తెలంగాణ ఇంటి పార్టీ. మా ఫోకస్ మొత్తం తెలంగాణ కోసమే. *మేము ఎవరికీ బీ టీమ్ కాదు. తెలంగాణలో మాదే నంబర్ వన్ పార్టీ అవుతుంది. *మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు మేధావులంతా పార్టీ ఆవిర్భావ సభకు రావాలని విజ్ఞప్తి చేస్తున్. *ప్రజాభిప్రాయం తీసుకొని పాలనలో వైఫల్యాలను రాముల వారు సరిచేసుకున్నార. *రాముల వారు స్ఫూర్తితో మా పార్టీని నడిపిస్తాం. *రాజకీయ పార్టీకి ఈగో ఉండకూడదు. నన్ను విమర్శించిన వాళ్లైనా సరే తెలంగాణ సోయి ఉంటే మాతో కలిసి రండి. *మా అజెండా మొత్తం కూడా ప్రాక్టికల్ గా, ప్రజల ఆమోదం పొందేలా ఉంటుంది. *ఏదైనా ప...

తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం

Image
తన గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల BRS అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్య గారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గారు స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి మరణంతో శొకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా.. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా జైశెట్టి రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా వారికి పేరున్నది. "సౌత్ ఇండియా టెంపుల్స్" అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య పీహెచ్‌డీ డాక్టర్ పట్టాను పొందారు. ...