Posts

Showing posts with the label Siddipet

సత్యసాయి సంజీవని ఆస్పత్రి సేవలు అమోఘం.. నా ఏడాది జీతాన్ని ట్రస్ట్‌కు అందిస్తా: హరీష్ రావు

Image
సిద్దిపేట జిల్లా కొండపాక శ్రీ సత్య సాయి సంజీవని ఆసుపత్రి లో ' గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ' కార్యక్రమంలో సినీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. ✳️ఈ చిన్నారులకు మళ్ళీ ప్రాణం పోసి పునర్జన్మ కల్పించిన మా వైద్యులకు, ఈ ఆసుపత్రిలో ఎంతో అంకితభావంతో, ప్రేమతో, సహనంతో, ఓర్పుతో చిన్నారులకు, వారి తల్లిదండ్రులకు అత్యుత్తమ వైద్యం అందిస్తున్న వైద్య బృందానికి, సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు. ✳️నిజంగా శ్రీనివాస్ గురించి నేను పొగడటానికి మాట్లాడటం లేదు. నా హృదయం నుంచి వచ్చిన మాట ఒక్కటే చెబుతున్నాను. శ్రీనివాస్ మనకు కనిపించే దేవుడు. ✳️దేవాలయంలో కనిపించని దేవుడిని మనం ప్రార్థిస్తాం. మన కష్టాలు తొలగించాలని, మన బాధలు దూరం చేయాలని చేతులు జోడించి వేడుకుంటాం. కానీ శ్రీనివాస్ గారు ఈ ఆసుపత్రి ద్వారా ప్రతి సంవత్సరం వేలాది చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. చిన్నారుల కళ్లలో ఆనందాన్ని, తల్లిదండ్రుల కళ్లలో ఆశను చూస్తుంటే నిజంగా నా హృదయం ఆనందంతో నిండిపోతుంది. ✳️ప్రతి సంవత్సరం సుమారు ఆరు వేల మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు, వైద్యసేవలు అందిస్తూ వా...

తన గురువు జైశెట్టి రమణయ్య మృతిపై కేసీఆర్ సంతాపం

Image
తన గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల BRS అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తనకు చదువు చెప్పిన గురువు, జగిత్యాలకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు, రిటైర్డ్ లెక్చరర్ జైశెట్టి రమణయ్య మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా తనకు గురువుగా, అత్యంత ఆత్మీయుడైన రమణయ్య గారితో తనకున్న అనుబంధాన్ని కేసీఆర్ గారు స్మరించుకున్నారు. రమణయ్య సిద్దిపేటలో లెక్చరర్ గా పనిచేస్తున్న సమయంలో, తను ఇంటర్మీడియట్ విద్యార్థిగా తన దగ్గర విద్యనభ్యసించిన సందర్భాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వారి మరణంతో శొకతప్త హృదయులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రమణయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కాగా.. 1971లో సిద్దిపేటలో జూనియర్, డిగ్రీ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా జైశెట్టి రమణయ్య పని చేశారు. చిన్న వయసులోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టిన అరుదైన వ్యక్తిగా, జగిత్యాలలో మొట్టమొదట డాక్టరేట్ పొందిన పరిశోధన విద్యార్థిగా వారికి పేరున్నది. "సౌత్ ఇండియా టెంపుల్స్" అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని సమర్పించి జైశెట్టి రమణయ్య పీహెచ్‌డీ డాక్టర్ పట్టాను పొందారు. ...